విక్టరీ వెంకటేష్ తొలిసారి డిజిటల్ డెబ్యూ చేసిన రానా నాయుడు కంటెంట్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేదు. ఎంత అడల్ట్స్ ఓన్లీ అని ముందే చెప్పినా సరే వెంకీ మీద నమ్మకంతో ట్రై చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తి షో చూడలేక కట్టేసిన దాఖలాలు చూశాం. దగ్గుబాటి హీరోకి మన దగ్గరున్న కుటుంబ ఇమేజ్ అలాంటిది కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు కానీ బయట ఆ సమస్య లేదుగా. అందులోనూ నెట్ ఫ్లిక్స్ వివిధ భాషల్లో వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేయడంతో దానికి తగ్గట్టే ఒక అరుదైన రికార్డు రానా నాయుడు ఖాతాలో వచ్చి చేరింది.
నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు స్ట్రీమింగ్ చేసిన ప్రపంచవ్యాప్త టాప్ 400 వెబ్ కంటెంట్ నుంచి ఇండియా తరఫున ఒక్క రానా నాయుడు మాత్రమే అందులో చోటు సంపాదించుకుంది. 1 కోటి 64 లక్షల వ్యూయింగ్ అవర్స్ (వీక్షించిన గంటలు)తో 336వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎవరినైతే లక్ష్యంగా పెట్టుకుని తీశారో ఆ టార్గెట్ పూర్తిగా నెరవేరినట్టే కనిపిస్తోంది. ఇదే ప్లాట్ ఫార్మ్ లో ఇంతకన్నా హిట్ అనిపించుకున్న షీ సీజన్ 2 లాంటివి వెనుకబడటం గమనార్హం. 812 మిలియన్ల గంటలతో అమెరికన్ థ్రిల్లర్ ది నైట్ ఏజెంట్ అగ్ర స్థానాన్ని అలంకరించింది. తర్వాత వెడ్నెస్ డే లాంటివి ఉన్నాయి.
మారుతున్న జనాల అభిరుచులకు అనుగుణంగా స్టార్ హీరోలు కనక వెబ్ సిరీస్ లు చేస్తే ఆదరణ ఉంటుందని రానా నాయుడు ఋజువు చేసింది. వెంకటేష్ ఇటీవలే సీజన్ 2 విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఫస్ట్ పార్ట్ ఇలా చేసావేంటని కొందరు నన్ను అడగటం ఆలోచనలో పడేసిందని చెప్పడం చూస్తే డోస్ తగ్గించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. రానా నాయుడు 2 ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. జనవరి చివరి వారంలో స్టార్ట్ చేయొచ్చు. వెంకీ ముందు ఒక్క సీజన్ చాలనుకున్నారు కానీ తక్కువ టైంలో వచ్చిన స్పందన చూసి మనసు మార్చుకుని సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
This post was last modified on December 13, 2023 1:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…