ప్రభాస్ సలార్ కు పోటీగా ఉండటంతో షారుఖ్ ఖాన్ డంకీ మీద తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఉన్నారు. అసలే పఠాన్, జవాన్ ఇలా రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ల తర్వాత చేస్తున్న మూవీ కావడం వల్ల అంచనాలు మాములుగా లేవు. క్లాసిక్ డైరెక్టర్ గా అపజయమే ఎరుగని రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ కం కామెడీ డ్రామాలో తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. సలార్ కన్నా ఒక్క రోజు ముందు డిసెంబర్ 21 థియేటర్లలో అడుగు పెడుతున్న డంకీ కథా కమామీషు ఏంటో మూడు నిమిషాల వీడియోలో స్పష్టంగా చెప్పేశారు.
ఇది 1995లో మొదలయ్యే కథ. హర్దయాల్ సింగ్ దిల్లాన్ అలియాస్ హార్డీ(షారుఖ్ ఖాన్) లాల్టూ పట్టణంలో అడుగు పెట్టక నలుగురు స్నేహితులు తోడవుతారు. ఓ అమ్మాయి మను(తాప్సి పన్ను) మనసు దోచుకుంటుంది. వీళ్ళ లక్ష్యం ఆంగ్ల బాష నేర్చుకుని లండన్ వెళ్లి జీవనోపాధి చూసుకోవడం. అయితే కుటుంబ పరిస్థితులతో పాటు ఇంగ్లీష్ వంటబట్టించుకోవడంలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. కొన్ని చేదు సంఘటనలు ఎదురవుతాయి . దీంతో ప్రాణాలకు తెగించి చొరబాటు మార్గం ద్వారా చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు సవాల్.
వినోదం, సందేశం, భావోద్వేగంతో పాటు యాక్షన్ కూడా జొప్పించారు రాజ్ కుమార్ హిరానీ. జవాన్ తరహాలోనే ఇందులో కూడా షారుఖ్ ఖాన్ యువకుడి నుంచి వృద్దుడి దాకా జరిగే పరిణామ క్రమాన్ని ఎమోషనల్ డ్రామాగా చూపించబోతున్నారు. తాప్సి, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో సీన్స్ పేలేలా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకపోయినా హిరానీ నుంచి ఆశించే ఎలిమెంట్స్ కి ఢోకా లేకుండా డంకీని తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. సినిమా మొత్తం ఇలాగే ఉంటే మాత్రం బాద్షా ఖాతాలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పడ్డట్టే. చూడాలి అంచనాల బరువుని ఏమేరకు మోస్తుందో
This post was last modified on December 5, 2023 12:20 pm
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో…
రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…
ఒకవైపు వైసీపీ నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు. ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని.. ఇక, చేయదని .. చంద్రబాబు పేదలకు…