ఎల్లుండి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సామాన్య ప్రజానీకంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా అధికార పార్టీ మాత్రం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది మేమేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇక్కడ టాలీవుడ్ టెన్షన్ పడేందుకు ఏముందనే డౌట్ రావడం సహజం. ఒకవేళ ప్రభుత్వం మారాల్సి వస్తే ఇండస్ట్రీ పట్ల దాని దృక్పథం ఎలా ఉండబోతోందనేది టాక్ అఫ్ ది టౌన్ గా మారుతుంది. ఎందుకంటే డిసెంబర్ 22 నుంచి భారీ చిత్రాలు వరసలో ఉన్నాయి. ముఖ్యంగా సలార్ తో.
టికెట్ రేట్ల పెంపు వ్యవహారం చాలా కీలకం కాబోతోంది. బిఆర్ఎస్ వస్తే ఇబ్బంది లేదు. ఎలాగూ పాత సిస్టమ్ కొనసాగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అనుమతులు వస్తాయి. లేదూ హస్తం గుర్తుకు జనం పట్టం కడితే మాత్రం పర్మిషన్ల తతంగం కొంచెం ఆలస్యం కావొచ్చు. ఏదున్నా రెండు వారాల్లోపే తేలిపోవాలి. తిరిగి సంక్రాంతి పండక్కు అందరూ హైక్ అడగాల్సిందే. గుంటూరు కారంతో మొదలుపెట్టి హనుమాన్ దాకా అందరి బడ్జెట్ రికవరీ కావాలంటే టికెట్లు పెంచుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే సలార్ దారి చూపిస్తే మిగిలినవి ఫాలో కావడానికి ఛాన్స్ ఉంటుంది.
మహా అయితే నలభై ఎనిమిది గంటల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకో మూడు నెలలు తిరగడం ఆలస్యం ఆంధ్రప్రదేశ్ లోనూ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈసారి జగన్ ఇంకోసారి వస్తాడా లేక టిడిపి జనసేన కలయికకు సింహాసనం దక్కుతుందానేది మరో ఆసక్తికరమైన అంశం. పాలిటిక్స్ తో సినిమాలకు నేరుగా సంబంధం లేకపోయినా ఎన్నో అవసరాలు ముడిపడి ఉన్నాయి. విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. సినిమాలు రిలీజ్ రోజు ఎలా అయితే హిట్టా ఫట్టా అనే డిస్కషన్ జరుగుతుందో ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ కౌంట్ డౌన్ ఆసక్తికరంగా ఉండబోతోంది.
This post was last modified on December 1, 2023 11:01 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…