ఎల్లుండి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సామాన్య ప్రజానీకంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా అధికార పార్టీ మాత్రం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది మేమేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇక్కడ టాలీవుడ్ టెన్షన్ పడేందుకు ఏముందనే డౌట్ రావడం సహజం. ఒకవేళ ప్రభుత్వం మారాల్సి వస్తే ఇండస్ట్రీ పట్ల దాని దృక్పథం ఎలా ఉండబోతోందనేది టాక్ అఫ్ ది టౌన్ గా మారుతుంది. ఎందుకంటే డిసెంబర్ 22 నుంచి భారీ చిత్రాలు వరసలో ఉన్నాయి. ముఖ్యంగా సలార్ తో.
టికెట్ రేట్ల పెంపు వ్యవహారం చాలా కీలకం కాబోతోంది. బిఆర్ఎస్ వస్తే ఇబ్బంది లేదు. ఎలాగూ పాత సిస్టమ్ కొనసాగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అనుమతులు వస్తాయి. లేదూ హస్తం గుర్తుకు జనం పట్టం కడితే మాత్రం పర్మిషన్ల తతంగం కొంచెం ఆలస్యం కావొచ్చు. ఏదున్నా రెండు వారాల్లోపే తేలిపోవాలి. తిరిగి సంక్రాంతి పండక్కు అందరూ హైక్ అడగాల్సిందే. గుంటూరు కారంతో మొదలుపెట్టి హనుమాన్ దాకా అందరి బడ్జెట్ రికవరీ కావాలంటే టికెట్లు పెంచుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే సలార్ దారి చూపిస్తే మిగిలినవి ఫాలో కావడానికి ఛాన్స్ ఉంటుంది.
మహా అయితే నలభై ఎనిమిది గంటల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకో మూడు నెలలు తిరగడం ఆలస్యం ఆంధ్రప్రదేశ్ లోనూ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈసారి జగన్ ఇంకోసారి వస్తాడా లేక టిడిపి జనసేన కలయికకు సింహాసనం దక్కుతుందానేది మరో ఆసక్తికరమైన అంశం. పాలిటిక్స్ తో సినిమాలకు నేరుగా సంబంధం లేకపోయినా ఎన్నో అవసరాలు ముడిపడి ఉన్నాయి. విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. సినిమాలు రిలీజ్ రోజు ఎలా అయితే హిట్టా ఫట్టా అనే డిస్కషన్ జరుగుతుందో ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ కౌంట్ డౌన్ ఆసక్తికరంగా ఉండబోతోంది.
This post was last modified on December 1, 2023 11:01 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…