ఎల్లుండి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సామాన్య ప్రజానీకంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా అధికార పార్టీ మాత్రం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది మేమేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇక్కడ టాలీవుడ్ టెన్షన్ పడేందుకు ఏముందనే డౌట్ రావడం సహజం. ఒకవేళ ప్రభుత్వం మారాల్సి వస్తే ఇండస్ట్రీ పట్ల దాని దృక్పథం ఎలా ఉండబోతోందనేది టాక్ అఫ్ ది టౌన్ గా మారుతుంది. ఎందుకంటే డిసెంబర్ 22 నుంచి భారీ చిత్రాలు వరసలో ఉన్నాయి. ముఖ్యంగా సలార్ తో.
టికెట్ రేట్ల పెంపు వ్యవహారం చాలా కీలకం కాబోతోంది. బిఆర్ఎస్ వస్తే ఇబ్బంది లేదు. ఎలాగూ పాత సిస్టమ్ కొనసాగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అనుమతులు వస్తాయి. లేదూ హస్తం గుర్తుకు జనం పట్టం కడితే మాత్రం పర్మిషన్ల తతంగం కొంచెం ఆలస్యం కావొచ్చు. ఏదున్నా రెండు వారాల్లోపే తేలిపోవాలి. తిరిగి సంక్రాంతి పండక్కు అందరూ హైక్ అడగాల్సిందే. గుంటూరు కారంతో మొదలుపెట్టి హనుమాన్ దాకా అందరి బడ్జెట్ రికవరీ కావాలంటే టికెట్లు పెంచుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే సలార్ దారి చూపిస్తే మిగిలినవి ఫాలో కావడానికి ఛాన్స్ ఉంటుంది.
మహా అయితే నలభై ఎనిమిది గంటల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకో మూడు నెలలు తిరగడం ఆలస్యం ఆంధ్రప్రదేశ్ లోనూ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈసారి జగన్ ఇంకోసారి వస్తాడా లేక టిడిపి జనసేన కలయికకు సింహాసనం దక్కుతుందానేది మరో ఆసక్తికరమైన అంశం. పాలిటిక్స్ తో సినిమాలకు నేరుగా సంబంధం లేకపోయినా ఎన్నో అవసరాలు ముడిపడి ఉన్నాయి. విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. సినిమాలు రిలీజ్ రోజు ఎలా అయితే హిట్టా ఫట్టా అనే డిస్కషన్ జరుగుతుందో ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ కౌంట్ డౌన్ ఆసక్తికరంగా ఉండబోతోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…