జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వార్ 2 విడుదల తేదీ అఫీషియల్ గా వచ్చేసింది. 2025 ఆగస్ట్ 14 విడుదల చేయబోతున్నట్టు యష్ రాజ్ ఫిలింస్ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు గురువారం. అంటే ఇండిపెండెన్స్ డేని కలుపుకుని సుదీర్ఘమైన నాలుగు రోజుల వీకెండ్ దొరకునుంది. నిజానికి ఆ ఏడాది జనవరి చివర్లో రిపబ్లిక్ డేకి రిలీజ్ చేస్తారనుకుంటే అప్పటికి షూటింగ్ అయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ కు టైం సరిపోదన్న కారణంతో ఇంకో ఆరు నెలలు జరిపారని ముంబై టాక్. అంటే ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇంకో సంవత్సరం తొమ్మిది నెలలు ఎదురు చూడాల్సి ఉంటుంది.
బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ 2 కి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఆల్రెడీ మొదలైపోయింది. హృతిక్, తారక్ లేని సన్నివేశాలు మొన్న నెలే షూట్ చేశారు. ఇద్దరు హీరోలు కలిసి డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో సెట్లో అడుగు పెట్టబోతున్నారు. వందల కోట్లతో రూపొందుతున్న గ్రాండియర్ కావడంతో నిర్మాణం విషయంలో యష్ సంస్థ తొందరపడే ఉద్దేశంలో లేదు. పైగా స్పై యూనివర్స్ లో భాగంగా ఇటీవలే వచ్చిన టైగర్ 3 అంచనాలు పూర్తిగా అందుకోలేకపోవడంతో అలెర్ట్ అయిన టీమ్ స్క్రిప్ట్ విషయంలో మళ్ళీ కొత్తగా జాగ్రత్తలు తీసుకుంటోంది.
తారక్ వార్ 2లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడనే లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది కానీ దాని తీరుతెన్నుల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం దేవరలో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత వార్ 2తో పాటు సమాంతరంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంటుంది. అది అధిక భాగం విదేశాల్లోనే ఉంటుందని లీక్ వచ్చేసింది. ఈ లెక్కన యంగ్ టైగర్ డైరీ రెండు మూడేళ్లు చాలా రైట్ గా ఉండబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ రావడంతో ఇకపై అలా జరగకుండా తారక్ ప్లానింగ్ మార్చేసుకున్నాడు. 2024 దేవర, 2025లో వార్ రిలీజులు కన్ఫర్మ్ అయ్యాయి.
This post was last modified on November 29, 2023 2:26 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…