జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వార్ 2 విడుదల తేదీ అఫీషియల్ గా వచ్చేసింది. 2025 ఆగస్ట్ 14 విడుదల చేయబోతున్నట్టు యష్ రాజ్ ఫిలింస్ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు గురువారం. అంటే ఇండిపెండెన్స్ డేని కలుపుకుని సుదీర్ఘమైన నాలుగు రోజుల వీకెండ్ దొరకునుంది. నిజానికి ఆ ఏడాది జనవరి చివర్లో రిపబ్లిక్ డేకి రిలీజ్ చేస్తారనుకుంటే అప్పటికి షూటింగ్ అయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ కు టైం సరిపోదన్న కారణంతో ఇంకో ఆరు నెలలు జరిపారని ముంబై టాక్. అంటే ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇంకో సంవత్సరం తొమ్మిది నెలలు ఎదురు చూడాల్సి ఉంటుంది.
బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ 2 కి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఆల్రెడీ మొదలైపోయింది. హృతిక్, తారక్ లేని సన్నివేశాలు మొన్న నెలే షూట్ చేశారు. ఇద్దరు హీరోలు కలిసి డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో సెట్లో అడుగు పెట్టబోతున్నారు. వందల కోట్లతో రూపొందుతున్న గ్రాండియర్ కావడంతో నిర్మాణం విషయంలో యష్ సంస్థ తొందరపడే ఉద్దేశంలో లేదు. పైగా స్పై యూనివర్స్ లో భాగంగా ఇటీవలే వచ్చిన టైగర్ 3 అంచనాలు పూర్తిగా అందుకోలేకపోవడంతో అలెర్ట్ అయిన టీమ్ స్క్రిప్ట్ విషయంలో మళ్ళీ కొత్తగా జాగ్రత్తలు తీసుకుంటోంది.
తారక్ వార్ 2లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడనే లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది కానీ దాని తీరుతెన్నుల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం దేవరలో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత వార్ 2తో పాటు సమాంతరంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంటుంది. అది అధిక భాగం విదేశాల్లోనే ఉంటుందని లీక్ వచ్చేసింది. ఈ లెక్కన యంగ్ టైగర్ డైరీ రెండు మూడేళ్లు చాలా రైట్ గా ఉండబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ రావడంతో ఇకపై అలా జరగకుండా తారక్ ప్లానింగ్ మార్చేసుకున్నాడు. 2024 దేవర, 2025లో వార్ రిలీజులు కన్ఫర్మ్ అయ్యాయి.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…