Political News

ఓడితే శ‌వ‌యాత్రే.. : ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారం ముగిసినా.. అభ్య‌ర్థుల‌కు ఇబ్బందులు మాత్రం త‌ప్ప‌డం లేదు. ఒక‌వైపు వారు ప్ర‌చారానికి చేసిన ఖ‌ర్చు లెక్క‌లు తేల్చేందుకు ఎన్నిక‌ల సంఘం రెడీ కావ‌డంతో అంద‌రూ స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రోవైపు ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు.. చివ‌రి నిముషంలో ప్ర‌జ‌ల‌ను ఎమోష‌న‌ల్‌గా ఆక‌ట్టుకునేందుకు, వారిని సెంటిమెంటుతోత‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. ప్ర‌య‌త్నించ‌డం.. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డంప‌ట్ల కూడా.. ఎన్నిక‌ల సంఘం చాలా సీరియ‌స్ అయింది.

తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల సంగ‌తి తేల్చాల‌ని.. ఎన్నిక‌ల సంఘం జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించింది. ఎన్నికల ప్రచారం చివ‌రి రోజు సాయంత్రం కౌశిక్ రెడ్డి ఓటర్లను ఒకవిధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. గెలిస్తే జైత్ర యాత్ర‌.. ఓడితే శ‌వ‌యాత్రే.. ఏది కోరుకుంటారో మీ ఇష్టం అంటూ.. కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు మీడియాలో జోరుగా వైర‌ల్ అయ్యాయి.

ఈ నేప‌థ్యంలో సుమోటోగా దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ఈ వ్యాఖ్య‌ల సంగ‌తేంటో తేల్చాల‌ని.. జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఈ కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఆర్వోకు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ చేప‌ట్టేలా ఆదేశించాల‌ని కూడా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. మొత్తంగా.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మ‌రో 24 గంట‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌ల దుమారం అధికార పార్టీని ఇరుకున పెడుతోంది. కౌశిక్‌రెడ్డి వివ‌ర‌ణ‌పై సంతృప్తి చెందితే స‌రే.. లేక‌పోతే ఏం చేస్తార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. కాగా, కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంనుంచి పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌ల‌ప‌డుతున్నారు.

This post was last modified on November 29, 2023 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago