తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసినా.. అభ్యర్థులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఒకవైపు వారు ప్రచారానికి చేసిన ఖర్చు లెక్కలు తేల్చేందుకు ఎన్నికల సంఘం రెడీ కావడంతో అందరూ సతమతం అవుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం చివరి రోజు.. చివరి నిముషంలో ప్రజలను ఎమోషనల్గా ఆకట్టుకునేందుకు, వారిని సెంటిమెంటుతోతమవైపు తిప్పుకొనేందుకు.. ప్రయత్నించడం.. కీలక వ్యాఖ్యలు చేయడంపట్ల కూడా.. ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది.
తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల సంగతి తేల్చాలని.. ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు సాయంత్రం కౌశిక్ రెడ్డి ఓటర్లను ఒకవిధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. గెలిస్తే జైత్ర యాత్ర.. ఓడితే శవయాత్రే.. ఏది కోరుకుంటారో మీ ఇష్టం
అంటూ.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో సుమోటోగా దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ వ్యాఖ్యల సంగతేంటో తేల్చాలని.. జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అదేవిధంగా ఈ కామెంట్స్పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఆర్వోకు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ చేపట్టేలా ఆదేశించాలని కూడా కలెక్టర్ను ఆదేశించారు. మొత్తంగా.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మరో 24 గంటల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల దుమారం అధికార పార్టీని ఇరుకున పెడుతోంది. కౌశిక్రెడ్డి వివరణపై సంతృప్తి చెందితే సరే.. లేకపోతే ఏం చేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. కాగా, కౌశిక్రెడ్డి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తలపడుతున్నారు.
This post was last modified on November 29, 2023 11:55 am
తెలంగాణలో జోరుగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులకు చెక్ పడే దిశగా మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం…
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భారతీయులను సైతం డిపోర్ట్ చేస్తున్నట్టు…
పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు… ఓ పదవి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే జుట్లు పట్టుకుంటే వారిద్దరికీ షాకిస్తూ మూడో…
లేటు వయసులో సినీ రంగంలో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు.. గోపరాజు రమణ. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో హీరో తండ్రి…
తిరుపతి నగర పాలక సంస్థలో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ ఎన్నిక గడచిన నాలుగైదు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో…
టాలీవుడ్ ను కుదిపేసిన ఆదాయపన్ను శాఖ దాడులు ఇప్పుడప్పుడే ముగిసేలా లేవు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్…