హృతిక్ రోషన్ పేరెత్తితే చాలు మంటెత్తి పోతుంది కంగనా రనౌత్. ‘క్రిష్-3’ చేస్తున్న సమయంలో అతడితో కొంత కాలం ఆమె డేటింగ్ చేసినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ దీని గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ.. కంగనా మాత్రం పలుమార్లు తాను, హృతిక్ సీక్రెట్గా డేటింగ్లో ఉన్నట్లు చెప్పింది.
హృతిక్ గురించి ఇంతకుముందే పలు ఆరోపణలు చేసిన కంగనా.. తాజాగా అతడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్లుగా పరోక్షంగా ఆరోపణలు చేసింది. అలాగే తాను కూడా ఓ సందర్భంలో డ్రగ్స్ రుచి చూసినట్లు ఆమె వెల్లడించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ తారల డ్రగ్స్ అలవాట్ల గురించి ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. చాలామందికి ఈ దురలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ దీని గురించి మాట్లాడింది.
ఓ నేషనల్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ ఓ స్టార్ హీరోకు డ్రగ్స్ అలవాటు బాగా ఉందని.. ఓసారి అతను డ్రగ్స్ను మోతాదు మించి తీసుకుని ఆసుపత్రి పాలయ్యాడని ఆరోపించింది. అతను ఈ విషయంలో మరీ అదుపు తప్పిపోవడంతో అతడిని భార్య కూడా విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయిందని అంది. ఆ సమయంలోనే తాను అతనితో డేటింగ్ చేశానని.. ఆ స్టార్ హీరో కుటుంబ సభ్యులు తనను ఇబ్బంది పెట్టారని అంది.
కంగనా డేటింగ్ చేశానని చెప్పిందంటే ఆ వ్యక్తి హృతిక్ రోషనే అని భావిస్తున్నారు. ఐతే ఎన్నోసార్లు హృతిక్ మీద కంగనా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యల్ని కూడా జనాలు అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఇండస్ట్రీలో తనకు గురువు అని చెప్పుకునే వ్యక్తి తనకు డ్రగ్స్ రుచించి చూపించినట్లు కంగనా తెలిపింది. ఆ వ్యక్తి ఆదిత్య పంచోలిగా అనుమానిస్తున్నారు. ఇండస్ట్రీలో 99 శాతం మంది డ్రగ్స్ను ఉపయోగిస్తుంటారని.. డ్రగ్స్ సరఫరా చేసేవారిని విచారిస్తే చాలా మంది స్టార్లు జైల్లోనే ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది కంగనా.
This post was last modified on August 30, 2020 4:42 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…