Illustrative picture of coronavirus vaccine under trail
కరోనా వైరస్ టీకా కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. వైరస్ను తగ్గించే, నివారించే మందు వచ్చిందంటే దాని కోసం దేశాలకు దేశాలు ఎలా ఎగబడతాయో తెలిసిందే. ఆ టీకా వద్దనే వాళ్లు ఎవరైనా ఉంటారా? కానీ ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన టీకాను ఎవరూ తీసుకోవద్దంటూ వివిధ దేశాల్లో ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు పిలుపునిస్తుండటం గమనార్హం. ఇందుకు కారణం కాస్త చిత్రమైందే.
1970లో మృతి చెందిన ఓ శిశువు మూలకణాలను టీకా అభివృద్ధిలో వినియోగించారని, అందుకే ఈ టీకా వాడొద్దనేది వారి వాదన. ఆస్ట్రేలియాలో ఈ విషయమై ముస్లిం మత పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టీకాను కొనుగోలు చేయొద్దని దేశ ప్రధానికి లేఖలు కూడా అందాయి. అక్కడి ముస్లిం సంస్థలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి తలెత్తడం గమనార్హం.
ఆక్స్ఫర్డ్ కరోనా టీకాను ముస్లింలు తీసుకోవద్దంటూ ఆస్ట్రేలియాకు చెందిన సుఫీయా ఖలీఫా అనే ఇమామ్ ఇటీవల పిలుపునిచ్చారు. ఓ మృత శిశువు మూల కణాలను టీకా కోసం ఉపయోగించడం అంటే ముస్లిం మతం ప్రకారం ఇది హరామ్ అని.. మతాచారాల ప్రకారం దాన్ని నిషేధిస్తున్నామని ఓ యూట్యూబ్ వీడియో ద్వారా ఆయన వివరించారు.
ఆస్ట్రేలియాకే చెందిన క్రిస్టియన్ మత పెద్ద ఆంటోనీ ఫిషర్ సైతం ఆక్స్ఫర్డ్ టీకాను వ్యతిరేకిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. టీకా అభివృద్ధిలో శిశువు మృతకణాలను వినియోగించారని ఆయన కూడా ఆరోపించారు. ఇది క్రైస్తవులకు నైతికపరమైన సమస్యను సృష్టిస్తోందని అన్నారు. ఆయన ప్రధాని ప్రధాని స్కాట్ మారిసన్కు లేఖ కూడా రాశారు. ఈయన లేఖకు మద్దతు తెలుపుతూ..ఆంగ్లికన్, గ్రీక్ ఆర్థొడాక్స్ మత పెద్దలు కూడా సంతకాలు చేశారు. వేరే దేశాల్లోనూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతన్నాయి. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
This post was last modified on August 30, 2020 4:47 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…