అనివార్య పరిస్థితుల్లో సలార్ పోటీ వచ్చి పడటంతో షారుఖ్ ఖాన్ డంకీకి పెద్ద చిక్కే వచ్చి పడింది. వెనక్కు తగ్గే ఆలోచన చేయడం లేదు కానీ ప్రమోషన్లలో ఎక్కడా రిలీజ్ డేట్ ని ప్రస్తావించకుండా జాగ్రత్త పడటం అనుమానాలకు తెరతీస్తోంది. డిసెంబర్ 21 రావడం పక్కా అని ఆ మధ్య ఒక పోస్టర్ వదిలారు కానీ తర్వాత వచ్చిన టీజర్ లో ఎక్కడా హైలైట్ చేయలేదు. దీపావళి పబ్లిసిటీలోనూ తేదీ లేదు. మరోవైపు తన గురించి వస్తున్న వాయిదా పుకార్లకు చెక్ పెడుతూ సలార్ బృందం డిసెంబర్ 22 కన్ఫర్మ్ చేస్తూ ట్రైలర్ ని వచ్చే నెల ఒకటిన గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్న విషయాన్ని ప్రకటించారు.
బాలీవుడ్ టాక్ ప్రకారం డంకీ ప్రస్తుతం రెండు డేట్ల పరిశీలనలో ఉంది. మొదటిది ఫస్ట్ అనుకున్న డిసెంబర్ 21. దీని వల్ల పెద్ద ఉపయోగం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లలో షోలు వేసుకోవచ్చు. కానీ ముందురోజు ఆక్వామెన్ వచ్చి ఉంటాడు కాబట్టి ఓవర్ సీస్ లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ సలార్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా దక్షిణాది థియేటర్ కౌంట్ తగ్గిపోతుంది. ఇది ఇంకా పెద్ద రిస్క్. లేదూ అనుకుంటే డిసెంబర్ 25 మరో మంచి ఆప్షన్. దాని కన్నా ముందు లాంగ్ వీకెండ్ ని పోగొట్టుకోవడం ఎంత వరకు సబబో షారుఖ్ ఖాన్ టీమ్ తీవ్ర విశ్లేషణలో ఉంది.
ఇంకో వారం పది రోజుల్లో దీన్ని తేల్చేయాలి. పంపిణీదారులు వైపు నుంచి ఇప్పటికే ఒత్తిడి ఉందట. సలార్ ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా ప్రమోషన్లను పీక్స్ కు తీసుకెళ్లేలా హోంబాలే ఫిలింస్ ప్లాన్ చేస్తోంది. దానికి ధీటుగా డంకీ ప్రణాళికలు ఉండాలి. ముందైతే అర్జెంట్ గా డేట్ లాక్ చేసుకుంటే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రభాస్ వర్సెస్ షారుఖ్ పోటీ ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఒక ఊర మాస్ యాక్షన్ కంటెంట్ కాగా మరొకటి ఎమోషన్ల మీద ఆధారపడ్డ రాజ్ కుమార్ హిరానీ మార్కు ఎంటర్ టైనర్. రెండూ దేనికవే నువ్వా నేనా అని తలపడటం ఖాయం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…