అనివార్య పరిస్థితుల్లో సలార్ పోటీ వచ్చి పడటంతో షారుఖ్ ఖాన్ డంకీకి పెద్ద చిక్కే వచ్చి పడింది. వెనక్కు తగ్గే ఆలోచన చేయడం లేదు కానీ ప్రమోషన్లలో ఎక్కడా రిలీజ్ డేట్ ని ప్రస్తావించకుండా జాగ్రత్త పడటం అనుమానాలకు తెరతీస్తోంది. డిసెంబర్ 21 రావడం పక్కా అని ఆ మధ్య ఒక పోస్టర్ వదిలారు కానీ తర్వాత వచ్చిన టీజర్ లో ఎక్కడా హైలైట్ చేయలేదు. దీపావళి పబ్లిసిటీలోనూ తేదీ లేదు. మరోవైపు తన గురించి వస్తున్న వాయిదా పుకార్లకు చెక్ పెడుతూ సలార్ బృందం డిసెంబర్ 22 కన్ఫర్మ్ చేస్తూ ట్రైలర్ ని వచ్చే నెల ఒకటిన గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్న విషయాన్ని ప్రకటించారు.
బాలీవుడ్ టాక్ ప్రకారం డంకీ ప్రస్తుతం రెండు డేట్ల పరిశీలనలో ఉంది. మొదటిది ఫస్ట్ అనుకున్న డిసెంబర్ 21. దీని వల్ల పెద్ద ఉపయోగం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లలో షోలు వేసుకోవచ్చు. కానీ ముందురోజు ఆక్వామెన్ వచ్చి ఉంటాడు కాబట్టి ఓవర్ సీస్ లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ సలార్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా దక్షిణాది థియేటర్ కౌంట్ తగ్గిపోతుంది. ఇది ఇంకా పెద్ద రిస్క్. లేదూ అనుకుంటే డిసెంబర్ 25 మరో మంచి ఆప్షన్. దాని కన్నా ముందు లాంగ్ వీకెండ్ ని పోగొట్టుకోవడం ఎంత వరకు సబబో షారుఖ్ ఖాన్ టీమ్ తీవ్ర విశ్లేషణలో ఉంది.
ఇంకో వారం పది రోజుల్లో దీన్ని తేల్చేయాలి. పంపిణీదారులు వైపు నుంచి ఇప్పటికే ఒత్తిడి ఉందట. సలార్ ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా ప్రమోషన్లను పీక్స్ కు తీసుకెళ్లేలా హోంబాలే ఫిలింస్ ప్లాన్ చేస్తోంది. దానికి ధీటుగా డంకీ ప్రణాళికలు ఉండాలి. ముందైతే అర్జెంట్ గా డేట్ లాక్ చేసుకుంటే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రభాస్ వర్సెస్ షారుఖ్ పోటీ ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఒక ఊర మాస్ యాక్షన్ కంటెంట్ కాగా మరొకటి ఎమోషన్ల మీద ఆధారపడ్డ రాజ్ కుమార్ హిరానీ మార్కు ఎంటర్ టైనర్. రెండూ దేనికవే నువ్వా నేనా అని తలపడటం ఖాయం.
This post was last modified on November 14, 2023 11:18 am
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…