Allu Arjun
పుష్ప 1 ది రైజ్ ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టరయ్యాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మాములుగా పెరగలేదు. ముఖ్యంగా మార్కెట్ కోణంలో బ్రాండ్ లను ప్రమోట్ చేయడానికి సంస్థలు ఆఫర్ చేస్తున్న మొత్తం కళ్లుచెదిరేలా ఉందని లేటెస్ట్ టాక్. ఒక్క రోజుకు గాను బన్నీ అక్షరాలా 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు ముంబై అప్డేట్. కొన్నేళ్ల క్రితం అరవై లక్షల రేంజ్ లో ఉన్న ధర కాస్తా నేషనల్ అవార్డు వచ్చాక ఇంకా పెరిగిపోయిందని అంటున్నారు. ఇలాంటివి అధికారికంగా చెప్పరు కానీ లీకవుతున్న డిజిటల్ వర్గాల సమాచారం మేరకు వ్యవహారం నమ్మశక్యంగానే ఉంది.
ఒకవేళ ఏదైనా బ్రాండ్ బన్నీని ఉపయోగించుకోవాలనుకుంటే అంత ఫీజు చెల్లించాల్సిందే. సింగల్ కాల్ షీట్లోనే మొత్తం చిత్రీకరణ, ఫోటో షూట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా ఏదైనా కావాలంటే ఛార్జ్ ఎక్స్ ట్రా. పుష్పకు వచ్చిన రీచ్ చూశాక ఇది న్యాయమైన మొత్తమేనని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయట. బిగ్ బి అమితాబ్ బచ్చనే జీవితంలో ఒక చెప్పు వదిలిన స్టెప్పు ఇంత పాపులర్ కావడం చూడలేదని ఇటీవలే కేబీసీ ప్రోగ్రాంలో అన్న మాట గుర్తుందిగా. దాన్ని నిజం చేస్తూ ముంబై నుంచి ప్రత్యేకంగా ఆఫర్లతో వచ్చి బ్రాండ్లు క్యూ కడుతున్న వైనాన్ని ఎలా తప్పని చెప్పగలం.
ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ మీద పూర్తి ఫోకస్ పెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమాల కోసం రెడీ అవుతాడు. వీటిలో ఏది ముందు మొదలవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు కానీ గుంటూరు కారం తర్వాత మాటల మాంత్రికుడు ఇంకెవరికి కమిట్ మెంట్లు ఇవ్వలేదు కాబట్టి దాదాపు ఇదే ఫస్ట్ ఉంటుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం మార్చ్ నుంచే షూటింగ్ మొదలుపెడతారు. ఆగస్ట్ 15 పుష్ప 2 విడుదలకు ముందు రెండు నెలలు బన్నీ పూర్తిగా బ్రేక్ తీసుకుని దాని ప్రమోషన్ కోసం వివిధ రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ టూర్ చేయబోతున్నాడు.
This post was last modified on November 13, 2023 11:15 pm
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…