హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో మొన్నటి తరం నుంచి ఇప్పటి జనరేషన్ దాకా అందరి హీరోల సినిమాల్లో నటించిన అరుదైన ఖ్యాతిని సంపాదించుకున్న విలక్షణ నటులు చంద్రమోహన్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ అపోలోలో హృద్రోగానికి చికిత్స తీసుకుంటూ ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో చివరి శ్వాస తీసుకున్నారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. కృష్ణాజిల్లా పమిడిముక్కాల స్వస్థలం. 1943 మే 23 జన్మించారు. 1966 రంగుల రాట్నంతో తెరంగేట్రం చేశారు. మొదటి సినిమనే గొప్ప పేరు తీసుకురావడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
కెరీర్ తొలినాళ్ళలోనే బివి రెడ్డి, కె విశ్వనాథ్, డి మధుసూదనరావు, ఎస్వి రంగారావు లాంటి అభిరుచి కలిగిన దర్శకులతో పనిచేసే అదృష్టం దక్కడంతో చంద్రమోహన్ కు చిరస్మరణీయ విజయాలు దక్కాయి. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబుతో ఘాడమైన స్నేహం కలిగిన ఈ అభినయ శిఖరం వాళ్ళతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్నారు. 80 దశకంలో హాస్య నటుడిగా రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన ఎన్నో ఆణిముత్యాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. కలికాలం, శంకరాభరణం, కొత్త నీరు, సిరిసిరిమువ్వ, ప్రేమించుకుందాం రా తదితరాలు చంద్రమోహన్ నటించిన మరపురాని చిత్రాల్లో కొన్ని.
తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు పొందటం చంద్రమోహన్ కు దక్కిన అరుదైన ఖ్యాతి. తర్వాత ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. చిరంజీవికి సహ హీరోగా ఆ తర్వాత అతనికే తండ్రిగానూ నటించి మెప్పించడం చంద్రమోహన్ కే చెల్లింది. 2017 గోపీచంద్ ఆక్సిజన్ తర్వాత అనారోగ్యం దృష్ట్యా బ్రేక్ తీసుకున్నప్పటికీ తరచు ఇంటర్వ్యూలు ఇస్తూ పాత కబుర్లు పంచుకున్న చంద్రమోహన్ ఇలా కన్ను మూయడం యావత్ పరిశ్రమకే కాదు ప్రేక్షక లోకానికీ తీరని లోటు. నటించే నిఘంటువుగా ఇప్పటి తరం వాళ్ళు ఆయన వృత్తి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.
This post was last modified on November 11, 2023 10:52 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…