Political News

‘స‌బిత‌’కు సెంటిమెంటు దెబ్బ‌..!


రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎన్నిక‌ల్లో అయినా.. త‌ర్వాత రాజ‌కీయంగా అయినా.. సెంటిమెంటును న‌మ్ముకున్న‌వారే రాజ‌కీయాల్లో స‌క్సెస్ అవుతున్నారు. ఇలానే దాదాపు రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో సెంటిమెంటును న‌మ్ముకుని విజ‌య తీరం చేరుతున్నారు మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్న ఈ కుటుంబం.. అనేక ప‌దువులు కూడా చేప‌ట్టింది.

ముఖ్యంగా కాంగ్రెస్‌కు, ఇటు మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఇంద్రారెడ్డి చేసిన త్యాగాలు, చేసిన కృషిని నిన్న మొన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఏక‌రువు పెడుతూనే ఉన్నారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో స‌బిత విజ‌యం సునాయాసంగా సాగిపోతోంది. ఇంద్రారెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత‌.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రోత్సాహంతో చేవెళ్ల‌(గ‌తంలో జ‌న‌ర‌ల్‌.. ఇప్పుడు ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు.

ఈ క్ర‌మంలోనే 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష‌క్‌తో ఆమె సుదీర్ఘ కాలం కొన‌సాగిన పార్టీని వ‌దులుకుని బీఆర్ ఎస్‌కు జై కొట్టారు. అనంత‌రం.. మంత్రి కూడా అయ్యారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌హేశ్వ‌రం బ‌రి నుంచిబీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీలోనూ ఉన్నారు. కానీ, కాంగ్రెసేత‌ర పార్టీల నుంచి పోటీ చేయ‌డం ఇదేతొలి సారి కావ‌డంతో త‌న‌కు సంప్ర‌దాయంగా వ‌స్తున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు స‌డ‌లిపోకుండా చూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కానీ, ఇప్పుడు ప్ర‌జ‌లు సెంటిమెంటుకు ప‌డిపోవ‌డం లేదు. ఆమె పార్టీ మార‌కుండా ఉండి ఉంటే.. ఇది ప‌నిచేసి ఉండేద‌ని అంటున్నారు. పార్టీ మారిపోయారు. పైగా.. పెద్ద‌గా అధికారాలు ఏవీ లేని మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. దీంతో |క్షేత్ర‌స్థాయిలో స‌బిత‌కు వ్య‌తిరేక‌త లేక‌పోయినా.. సానుభూతి, సానుకూలత అయితే.. గ‌తంలో ఉన్నంత లేవ‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 11, 2023 8:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

19 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago