మేం అన్ని సినిమాలను ఆదరిస్తామని తమిళ హీరోలు ఇక్కడికి వచ్చినప్పుడు గొప్పలు చెప్పుకోవడమే కానీ వాస్తవానికి పరిస్థితి దానికి భిన్నంగా ఉందన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఆ స్టేట్ మెంట్ సమర్ధించుకోవడానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ పేర్లు వాడి ఏదో లాజిక్ మాట్లాడాం అనుకుంటారు కానీ అవి కాకుండా ఇతర బాష నుంచి వచ్చిన ఒక కమర్షియల్ మూవీ తమిళనాడులో ఆడిన దాఖలాలు చూపించమంటే మాత్రం దిక్కులు చూడాల్సిందే. ఇది పక్క రాష్ట్రంలో మనకు దక్కే రిసెప్షన్. కానీ అక్కడివి ఏవైనా డబ్బింగులు వస్తే మాత్రం మనోళ్లు ఛాన్స్ తక్కువగా ఉన్నా పోటీపడి మరీ థియేటర్ల అడ్జస్ట్ చేస్తారు.
సంక్రాంతికి వేడి చాలా తీవ్ర స్థాయిలో రాజుకోనుంది. తెలుగు నిర్మాతలు గొంతు పెంచకపోతే అన్యాయమైపోయేది మన సినిమాలే. రజనీకాంత్ లాల్ సలాం, శివ కార్తికేయన్ అయలన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ లు పొంగల్ కి పక్కాగా వస్తున్నాయి. ఇక్కడ చూస్తేనేమో గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ లకు స్క్రీన్లు సరిపోకపోతే ఏం చేయాలో అర్థం కాక బయ్యర్లు బుర్రలు బద్దలు కొంటున్నారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఎవరైనా పైన చెప్పిన మూడు ఆరవ బొమ్మలు హక్కులు కొనేసుకొచ్చి మాకూ థియేటర్లు ఇవ్వండని డిమాండ్ చేస్తే అప్పుడేం చేయాలి.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ సమస్య మీద ఒక అండర్ స్టాండింగ్ కు రావాల్సిందే. మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియాలో గుర్తింపు ఉన్న హీరోలే అయినా సంక్రాంతికి మనకూ థియేటర్లు పంచమంటే కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకుంటారా. ససేమిరా అంటారు. మనం మాత్రం అనువాద హక్కులు కొన్నారన్న జాలితో ఎంత కష్టమైనా సర్దుబాటుకు సహకరిస్తాం. ఈ ఏడాది చిరంజీవి, బాలయ్యలు ఉన్నా సరే విజయ్, అజిత్ కు తగినన్ని థియేటర్లు దక్కాయి. ఈసారి ఇంతకు ఐదింతల పెద్ద చిక్కు రాబోతోంది. ఇప్పుడైనా ఒక తాటిపైకి వస్తారా లేక ఎవరి వ్యాపారం వాళ్ళదని వదిలేస్తారా చూడాలి.
This post was last modified on November 9, 2023 12:54 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…