అక్కినేని నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాకు సిద్ధమవుతున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కనున్న సినిమా అతి త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. కార్తికేయ, కార్తికేయ-2 చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘లవ్ స్టోరీ’లో చైతూతో జత కట్టిన సాయిపల్లవిని కథానాయికగా ఖరారు చేయడం తెలిసిందే.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు వంద కోట్లని అంటున్నారు. చైతూ స్థాయికి ఇది చాలా పెద్ద బడ్జెట్టే. ఒక గుజరాతీ కథను ఆధారం చేసుకుని భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్నీ భారీగా ఉండేలా చూసుకుంటున్నారు. చైతూ కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాకూ జరగనంత కసరత్తు ఈ సినిమాకు జరుగుతోంది. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్.. వర్క్ షాప్స్.. ప్రి ప్రొడక్షన్ అన్నీ కూడా చాన్నాళ్లుగా నడుస్తున్నాయి.
తన పాత్ర కోసం చైతూ బాడీ పెంచడమే కాక.. స్టైలింగ్ కూడా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ సినిమాకు పేరుమోసిన టెక్నీషియన్లు పని చేయబోతున్నారు. రకరకాల ఆప్షన్లు పరిశీలించాక చివరికి దేవిశ్రీ ప్రసాద్ను సంగీత దర్శకుడిగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇంతకుముందు చైతూకు ‘దడ’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవి. చాలా గ్యాప్ తర్వాత చైతూ సినిమాకు అతను పని చేయబోతున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ బాధ్యతలను మధీకి అప్పగించబో
తున్నట్లు సమాచారం. ఆయన అందుబాటులో ఉంటే ఓకే, లేదంటే మరో పేరున్న సినిమాటోగ్రార్నే తీసుకోబోతున్నారట. ప్రొడక్షన్ డిజైన్ సహా సాంకేతిక విభాగాలన్నింటినీ పేరున్న వారినే తీసుకుని ప్రపంచ స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా క్లిక్ అయితే చైతూ రేంజే మారిపోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
This post was last modified on November 6, 2023 1:29 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…