వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జగన్ సర్కారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రద్దు చేసిన హైకోర్టు… తాజాగా జగన్ సర్కారుకు మరో షాకిచ్చింది.
ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ మైనింగ్ లీజులు రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం జగన్ సర్కారు జారీ చేసిన ఆదేశాలు చెల్లవంటూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజకీయ దురుదేశంతో లీజులు రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదన సరైనదేనన్న రీతిలో స్పందించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాశం జిల్లాలో ఈ ఇద్దరు టీడీపీ నేతలకు సంబంధించిన గ్రానైట్ కంపెనీ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. క్వారీయింగ్లో లోపాలు ఉన్నాయన్న కారణం చూపుతూ ఇద్దరు నేతల క్వారీల లీజులను రద్దు చేసింది.
ఇందులో ఎమ్మెల్యే గొట్టిపాటికి చెందిన ఐదు క్వారీలు, సన్నిహితులకు సంబంధించిన ఆరు క్వారీలు, పోతుల రామారావుకు సంబంధించిన ఒక క్వారీ ఉంది. అంతేకాదు గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో జరిమానాలు విధించగా.. ఇప్పుడు ఏకంగా లీజులే రద్దు చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
లీజులు రద్దుకు సంబంధించిన నోటీసులు రాగానే టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
This post was last modified on August 28, 2020 11:43 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…