తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలను ఎలా నెత్తిన పెట్టుకుంటారో తెలిసిందే. దసరాకు తెలుగులో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి భారీ చిత్రాలు రిలీజ్ కాగా.. వాటితో పోలిస్తే తమిళ అనువాద చిత్రమైన ‘లియో’కే ఎక్కువ క్రేజ్ కనిపించింది తొలి రోజు. ఆ చిత్రం బ్యాడ్ టాక్తో మొదలైనా సరే.. బ్రేక్ ఈవెన్ అయింది తెలుగులో. ‘లియో’కు తెలుగులో భారీగా థియేటర్లు కేటాయించి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చూశారు. కానీ అదే సమయంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేద్దామని చూస్తే ఆ రాష్ట్రంలో థియేటర్లు ఇవ్వలేదు.
దీంతో రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తమిళ అనువాదాల విషయంలో మన ప్రేక్షకులు, ఇండస్ట్రీ జనాలు ఉన్నంత స్పోర్టివ్గా.. మన సినిమాల విషయంలో తమిళ ప్రేక్షకులు, అక్కడి ఇండస్ట్రీ ఉండదనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. ఇందుకు దసరా సినిమాలు తాజా రుజువు. ఈ నేపథ్యంలో ‘తంగలాన్’ సినిమా తెలుగు టీజర్ లాంచ్ కోసం వచ్చిన విక్రమ్ అండ్ కోకు మీడియా నుంచి ఈ చిన్నచూపు విషయమై ప్రశ్న ఎదురైంది. కానీ విక్రమ్, నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక మొక్కుబడి జవాబు ఇచ్చారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తమిళంలో బాగా ఆడాయని.. గతంలో కూడా చాలా సినిమాలు తమిళంలో మంచి ప్రభావం చూపాయని అన్నారు. ‘బాహుబలి’ కొన్నేళ్ల పాటు తమిళంలో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిందని కూడా చెప్పారు. ఐతే ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అనివార్యంగా తమిళ ప్రేక్షకులు చూస్తారు. అంతే కాక అక్కడ థియేటర్లు కూడా ఇస్తారు. కానీ వేరే సినిమాలకు మాత్రం తమిళంలో ఇబ్బందులు తప్పట్లేదు.
అక్కడ థియేటర్లు ఇవ్వరు. జనం కూడా వాటిని ప్రోత్సహించరు. వాళ్లకు లోకల్ ఫీలింగ్ ఎక్కువ. ఐతే అక్కడి ప్రేక్షకులను మా సినిమాలు చూడండి అని డిమాండ్ చేయలేం, అలాగే తమిళ అనువాద సినిమాలు చూడొద్దని మన ప్రేక్షకులను ఆపలేం. కానీ మన సినిమాలు రిలీజవుతుంటే అక్కడ ఓ మోస్తరుగా అయినా థియేటర్లు ఇవ్వాలి.. ఇండస్ట్రీ నుంచి మన సినిమాలకు సహకారం అందాలి.. అదే సమయంలో తమిళ అనువాద చిత్రాలక ‘తంగలాన్’, ‘అయలాన్’ లాగా కాకుండా కనీసం తెలుగు టైటిళ్లు పెట్టాల అన్నవి న్యాయమైన డిమాండ్లే.
This post was last modified on November 2, 2023 6:29 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…