Allu Arjun
మన స్టార్ హీరోలకు మల్టీప్లెక్స్ బిజినెస్ బాగా కలిసి వస్తున్నట్టుంది. ఏఎంబి మాల్ తో మహేష్ బాబు ఈ రంగంలోనూ బ్లాక్ బస్టర్ కొట్టాక త్వరలో ఏకంగా రాష్ట్రం దాటేసి బెంగళూరులోనూ ఒకటి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. దీనికీ ఏషియన్ ఫిలిమ్స్ భాగస్వామిగా వ్యవహరించబోతోంది. ఈ స్ఫూర్తితోనే విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ఒక సముదాయం ఓపెన్ చేయగా సూపర్ హిట్ కొట్టేసింది. ఆ జిల్లా ప్రజలకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. చెన్నైలో శివ కార్తికేయన్ పార్ట్ నర్ షిప్ లో ఈ తరహాలోనే మల్టీప్లెక్స్ పనులను వేగవంతం చేసింది ఏషియన్ ఫిలిమ్స్.
వీళ్ళందరితో పాటు అల్లు అర్జున్ ఇటీవలే అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థానంలో అయిదు స్క్రీన్ల సముదాయంతో ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. మళ్ళీ ప్రత్యేకంగా ఏషియన్ భాగస్వామ్యమని చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా అల్లు ఫ్యామిలీ ఇంకో ప్లానింగ్ లో ఉందట. హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన డిమాండ్ ఉన్న ప్రాంతంగా మారిపోయిన కోకాపేట్ లో ఒక మల్టీప్లెక్స్ నిర్మించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు వినికిడి. నర్సింగికి దగ్గరయ్యే రీతిలో ఒక మంచి చోటు చూసి ఆ మేరకు ప్రీ ప్లానింగ్ కూడా జరిగిపోయిందని సమాచారం. అధికారికంగా రాలేదు.
ఇది బన్నీ సోలోగా నడిపిస్తాడా లేక జాయింట్ గా వేరొకరు ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఖరీదైన అనుభూతిని కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ లు అందజేస్తున్న మల్టీప్లెక్సులు భాగ్యనగరంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్నా ఆదరణ బాగానే ఉంటోంది. ఎటాచ్సి కొత్త హిట్ సినిమాలు వచ్చినప్పుడు ఇబ్బంది లేదు కానీ ఎపుడైనా శుక్రవారాలు సరైన రిలీజులు లేక డ్రైగా మారిపోతే మాత్రం షోలు క్యాన్సిల్ చేసుకుంటూ ఖాళీ కౌంటర్లతో గడపాల్సి వస్తోంది. అయినా లాభసాటి బిజినెస్ కాకపోతే ఎవరైనా ఇందులోకి ఎందుకు వస్తారు చెప్పండి.
This post was last modified on October 23, 2023 9:47 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…