ప్యాన్ ఇండియా సినిమాలకు సంగీత దర్శకుడిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెలక్షన్ ఏ మాత్రం తేడా కొట్టినా దాని ఎఫెక్ట్ నేరుగా థియేటర్ ఆడియన్స్ మీద పడుతుంది. కేవలం అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే జైలర్, విక్రమ్ లు వాటి కంటెంట్ స్థాయిని మించి బాక్సాఫీస్ అద్భుతాలు చేశాయన్నది వాస్తవం. తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు సైతం తమకు స్వేచ్ఛ, ఛాలెంజ్ ఇచ్చే కంటెంట్ దొరికినప్పుడు చెలరేగిపోవడం చాలా సార్లు చూశాం. అఖండ, వాల్తేరు వీరయ్య లాంటి ఉదాహరణలు చాలు. ఈ మధ్య తమిళ మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవడం ఎక్కువయ్యింది.
జివి ప్రకాష్ కుమార్ మనకు కొత్త కాదు. ప్రభాస్ డార్లింగ్, రామ్ ఎందుకంటే ప్రేమంటకు మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. ఒంగోలు గిత్తకు నాలుగు పాటలు కంపోజ్ చేశాడు. డబ్బింగ్ చిత్రాల్లోనూ యుగానికి ఒక్కడు, షాపింగ్ మాల్ లాంటివి చాలా పేరు తీసుకొచ్చాయి. ఆ నమ్మకంతోనే టైగర్ నాగేశ్వరరావు లాంటి పెద్ద బాధ్యతను అతనికి ఇచ్చారు. ట్యూన్స్ రాబట్టుకోవడం దర్శకుడు వంశీ ఫెయిలయ్యాడో లేక మంచి బిజిఎం ఇవ్వడంతో ప్రకాష్ తడబడ్డాడో తెలియదు కానీ కానీ రవితేజ మూవీకి అతి పెద్ద మైనస్ లలో సంగీతం ఉండటం మాస్ రాజా అభిమానులను బాగా కలవరపరిచింది .
ఇంత టాలెంట్ ఉన్న ప్రకాష్ ఇలాంటి స్కోర్ ఇవ్వడం షాక్ ఇచ్చేదే. ఇతని రాబోయే సినిమాలు కూడా ఆషామాషీవి కాదు. ధనుష్ కెప్టెన్ మిల్లర్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, విక్రమ్ తంగలాన్, కంగనా రౌనత్ ఎమెర్జెన్సీ, కార్తీ జపాన్, అక్షయ్ కుమార్ ఆకాశం నీ హద్దురా రీమేక్ ఇలా పెద్ద లిస్టు ఉంది. మరి పని ఒత్తిడిలో టైగర్ నాగేశ్వరరావు సరిగా అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాడా లేక ఇంకేదైనా కారణమా లోగుట్టు పెరుమాళ్ళకెరుక. అదే పనిగా కోలీవుడ్ నుంచి తీసుకొచ్చి మరీ ఆఫర్ ఇస్తే ఇలా చేయడం భావ్యం కాదు కానీ వీలైనంత బెస్ట్ రాబట్టుకోవడంలో మొదటి బాధ్యత ముమ్మాటికీ దర్శకుడిదే.
This post was last modified on October 21, 2023 11:59 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…