మొన్నటి నుంచి మనం భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో అంటూ దసరా సినిమాల హడవిడిలో పడిపోయాం కానీ సందట్లో సడేమియా అంటూ ఓ బాలీవుడ్ మూవీ వచ్చిన సంగతే జనాలు మర్చిపోయారు. అదే గణపథ్. మాస్ లో మంచి మార్కెట్ ఉన్న టైగర్ శ్రోఫ్ హీరోగా, ఆదిపురుష్ సీత కృతి సనన్ హీరోయిన్ గా రూపొందిన ఈ స్కై ఫై ఫాంటసీలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించారు. టీజర్ రిలీజైన టైంలో ప్రభాస్ కల్కి పోలికలు ఉన్నాయనే అనునామాలు కొందరు వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఈ గణపథ్ థియేటర్ కు వచ్చిన జనాలను పూర్తిగా చూడనివ్వకుండానే పరుగులు పెట్టిస్తున్నాడు.
ఇదో విచిత్రమైన కథ. 2060 AD సంవత్సరంలో ప్రపంచం రెండుగా విడిపోయి ఉంటుంది. ఒకటి ధనవంతులు సృష్టించిన సిల్వర్ సిటీ. ఇక్కడ మనుషుల కన్నా రోబోలు, డ్రోన్లు ఎక్కువ ఉంటాయి. సాంకేతికత ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. మరొకటి గరీబొంకి బస్తీ. అంటే కూడు గుడ్డకు ఠికానా లేని పేదవాళ్ల అడ్డా. తమను కాపాడేందుకు గణపథ్ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కారణజన్ముడే హీరో గుడ్డు(టైగర్ శ్రోఫ్). ఇతడేమో డబ్బున్న వాళ్ళ వైపు ఉంటాడు. మరి బాబుకి జ్ఞానోదయం కలిగి అన్నార్తుల కోసం ఏం చేశాడు, గణపథ్ గా ఎలా మారాడు అనేదే స్టోరీ.
తీసికట్టు విజువల్ ఎఫెక్ట్స్ తో సహనానికి పెద్ద పరీక్ష పెడతాడు గణపథ్. టైగర్ శ్రోఫ్ హీరోయిజంని అతిగా ఎలివేట్ చేయించే ఉద్దేశంతో పెట్టిన ఫైట్లు, చీటికీ మాటికి చొక్కా విప్పించి సిక్స్ ప్రదర్శనలు ఇప్పించడాలు హద్దులు దాటిపోయాయి. అమితాబ్ క్యారెక్టర్ కామెడీకి సీరియస్ కి మధ్య అప్పడమైపోయింది. మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్, డిస్ట్రిక్ట్ 9, ఎలిసియం లాంటి హాలీవుడ్ మూవీస్ ని నిర్మొహమాటంగా కాపీ కొట్టిన దర్శకుడు వికాస్ బహ్ల్ కనీస స్థాయిలో గణపథ్ ని తీర్చిదిద్దలేదు. ఫలితం క్లైమాక్స్ చివరి దాకా కూర్చున్న వాళ్ళను సన్మానించాలనే రేంజ్ లో ఈ కళాఖండం ఉందని విమర్శకులు తలంటుతున్నారు.
This post was last modified on October 21, 2023 11:20 am
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…