ఎంతో ఇష్టపడి కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ మీద దర్శకులకు ఎంతైనా నమ్మకం ఉండొచ్చు. నిడివి ఎక్కువ ఉంటే ప్రేక్షకులు ఇంకా బాగా ఆస్వాదిస్తారనే ధీమా కలగొచ్చు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే అది ఏకంగా ఫలితం మీదే ప్రభావం చూపిస్తుంది. గతంలో నాని అంటే సుందరానికి లెన్త్ మరీ ఎక్కువయ్యిందని, ఒక ఇరవై నిముషాలు ట్రిమ్ చేస్తే ఆడియన్స్ కి ఇంకా బాగా కనెక్ట్ అవుతుందని మీడియా, ప్రేక్షకులు ఇద్దరూ అభిప్రాయపడ్డారు. కానీ వివేక్ ఆత్రేయ ఒప్పుకోలేదు. తాను అనుకున్న రెండు గంటల యాభై అయిదు నిమిషాల నిడివికే కట్టుబడ్డాడు. ఫలితంగా బ్రేక్ ఈవెన్ కాలేదు.
తాజాగా టైగర్ నాగేశ్వరరావుకు ఇదే సమస్య వచ్చింది. కంటెంట్ మరీ దారుణంగా లేదు. యావరేజే. కానీ సెకండ్ హాఫ్ లో మోతాదుకి మించి ఫైట్లు, ఎమోషనల్ సీన్స్ పెట్టేయడంతో జనాలకు విపరీతంగా బోర్ కొట్టేసింది. పీ రిలీజ్ ప్రమోషన్లలో దర్శకుడు వంశీ ఇంకో గంట ఉన్నా చూసేంత గొప్పగా కంటెంట్ ఉందని అతిశయోక్తి పోయాడు. తీరా చూస్తే అదే పెద్ద మైనస్ అయ్యింది. అంటే మూడు గంటలు థియేటర్లలో కూర్చునే ఓపిక పబ్లిక్ కి లేదా అంటే నిక్షేపంగా ఉంది. అర్జున్ రెడ్డి, ఆర్ఆర్ఆర్ లు బ్లాక్ బస్టరయ్యాయి. రంగస్థలం, మహానటిలు నూటా అరవై నిమిషాలతో కుర్చీలకు కట్టిపడేశాయి.
ఇలా చెప్పుకుంటే లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక నిజంగా మూడు గంటల నిడివి డిమాండ్ చేస్తోందా ఎక్కడైనా ల్యాగ్ వస్తోందాని దర్శకుడు, నిర్మాత కలిసి ఇతరులకు షో వేసినప్పుడు నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోవాలి. పానకం ఎంత తీయగా గ్లాసుడు తాగగలం కానీ ట్యాంక్ మొత్తం తాగితే ఆసుపత్రి బెడ్డు చేరాల్సిందే. అదే దాహం వేసినప్పుడు, వర్కౌట్స్ చేసినప్పుడు మంచి నీళ్లు ఎక్కువ తాగినా నష్టం లేదు. ఇది గుర్తించనంత కాలం నిడివే సినిమాల పాలిట శాపంగా మారి అన్యాయంగా వసూళ్ల మీద ప్రభావం పడి నిర్మాత చేతులు కాలడం ఖాయం.
This post was last modified on October 21, 2023 9:45 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…