థియేటరుకు వెళ్లి సినిమా చూడటం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి చాలా ఇష్టమైన వ్యాపకం. ఆ వ్యాపకానికి కరోనా గండి కొట్టేసింది. వారం వారం కొత్త సినిమా విడుదల కాగానే థియేటర్లకు పరుగులు పెట్టే ప్రేక్షకుల పరిస్థితి ఈ ఆరు నెలల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. కొత్త, పాత అని తేడా లేకుండా వెళ్లి ఏదో ఒక సినిమాను బిగ్ స్క్ర్రీన్ మీద చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు లెక్కే లేదు. ఇండియాలో వచ్చే నెలలోనే థియేటర్లు తెరుచుకుంటాయని అంటున్నారు. వేరే దేశాల్లో అయితే ఆల్రెడీ థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి.
కరోనా షరతుల మధ్య విజయవంతంగా సినిమాలు నడిపించేస్తున్నారు. అసలే చాలా విరామం తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. పైగా క్రిస్టఫర్ నోలన్ తీసిన మెగా మూవీ ‘టెనెట్’ విడుదలైంది. ఇక ప్రపంచ సినీ ప్రియుల ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పేదేముంది?
సామాన్య ప్రేక్షకులే కాదు.. టామ్ క్రూయిజ్ లాంటి అగ్ర కథానాయకుడు కూడా ఈ విషయంలో తన ఎగ్జైట్మెంట్ను ఆపుకోలేకపోయాడు. ఈ సినిమా ఆడుతున్న ఓ మెగా థియేటర్కు వెళ్లాడు. అక్కడ ప్రేక్షకుల హంగామా మధ్య సినిమా చూశాడు. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆ వీడియో ఉద్వేగానికి గురి చేస్తోంది.
సినిమా అంటే వీళ్లందరిలో ఉన్న ప్రేమను ఉద్వేగభరితంగా చాటుకుంటున్నారు. ఈ ఏడాది వేసవిలోనే రావాల్సిన ‘టెనెట్’ కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవలే పరిస్థితులు మెరుగుపడ్డ కొన్ని దేశాల్లో విడుదలైంది. సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉందని, నోలన్ నుంచి వచ్చిన మరో క్లాసిక్ ఇదని అంటున్నారు. కరోనా పరిస్థితుల్ని సమీక్షిస్తూ.. ఒక్కో దేశంలో ఈ సినిమా విడుదల చేసుకుంటూ వెళ్లనున్నారు.ఇండియాలో కూడా దసరా సమయానికి ‘టెనెట్’ విడుదల కావచ్చని ఆశిస్తున్నారు.
This post was last modified on August 30, 2020 9:44 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…