థియేటరుకు వెళ్లి సినిమా చూడటం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి చాలా ఇష్టమైన వ్యాపకం. ఆ వ్యాపకానికి కరోనా గండి కొట్టేసింది. వారం వారం కొత్త సినిమా విడుదల కాగానే థియేటర్లకు పరుగులు పెట్టే ప్రేక్షకుల పరిస్థితి ఈ ఆరు నెలల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. కొత్త, పాత అని తేడా లేకుండా వెళ్లి ఏదో ఒక సినిమాను బిగ్ స్క్ర్రీన్ మీద చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు లెక్కే లేదు. ఇండియాలో వచ్చే నెలలోనే థియేటర్లు తెరుచుకుంటాయని అంటున్నారు. వేరే దేశాల్లో అయితే ఆల్రెడీ థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి.
కరోనా షరతుల మధ్య విజయవంతంగా సినిమాలు నడిపించేస్తున్నారు. అసలే చాలా విరామం తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. పైగా క్రిస్టఫర్ నోలన్ తీసిన మెగా మూవీ ‘టెనెట్’ విడుదలైంది. ఇక ప్రపంచ సినీ ప్రియుల ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పేదేముంది?
సామాన్య ప్రేక్షకులే కాదు.. టామ్ క్రూయిజ్ లాంటి అగ్ర కథానాయకుడు కూడా ఈ విషయంలో తన ఎగ్జైట్మెంట్ను ఆపుకోలేకపోయాడు. ఈ సినిమా ఆడుతున్న ఓ మెగా థియేటర్కు వెళ్లాడు. అక్కడ ప్రేక్షకుల హంగామా మధ్య సినిమా చూశాడు. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆ వీడియో ఉద్వేగానికి గురి చేస్తోంది.
సినిమా అంటే వీళ్లందరిలో ఉన్న ప్రేమను ఉద్వేగభరితంగా చాటుకుంటున్నారు. ఈ ఏడాది వేసవిలోనే రావాల్సిన ‘టెనెట్’ కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవలే పరిస్థితులు మెరుగుపడ్డ కొన్ని దేశాల్లో విడుదలైంది. సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉందని, నోలన్ నుంచి వచ్చిన మరో క్లాసిక్ ఇదని అంటున్నారు. కరోనా పరిస్థితుల్ని సమీక్షిస్తూ.. ఒక్కో దేశంలో ఈ సినిమా విడుదల చేసుకుంటూ వెళ్లనున్నారు.ఇండియాలో కూడా దసరా సమయానికి ‘టెనెట్’ విడుదల కావచ్చని ఆశిస్తున్నారు.
This post was last modified on August 30, 2020 9:44 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…