థియేటరుకు వెళ్లి సినిమా చూడటం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి చాలా ఇష్టమైన వ్యాపకం. ఆ వ్యాపకానికి కరోనా గండి కొట్టేసింది. వారం వారం కొత్త సినిమా విడుదల కాగానే థియేటర్లకు పరుగులు పెట్టే ప్రేక్షకుల పరిస్థితి ఈ ఆరు నెలల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. కొత్త, పాత అని తేడా లేకుండా వెళ్లి ఏదో ఒక సినిమాను బిగ్ స్క్ర్రీన్ మీద చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు లెక్కే లేదు. ఇండియాలో వచ్చే నెలలోనే థియేటర్లు తెరుచుకుంటాయని అంటున్నారు. వేరే దేశాల్లో అయితే ఆల్రెడీ థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి.
కరోనా షరతుల మధ్య విజయవంతంగా సినిమాలు నడిపించేస్తున్నారు. అసలే చాలా విరామం తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. పైగా క్రిస్టఫర్ నోలన్ తీసిన మెగా మూవీ ‘టెనెట్’ విడుదలైంది. ఇక ప్రపంచ సినీ ప్రియుల ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పేదేముంది?
సామాన్య ప్రేక్షకులే కాదు.. టామ్ క్రూయిజ్ లాంటి అగ్ర కథానాయకుడు కూడా ఈ విషయంలో తన ఎగ్జైట్మెంట్ను ఆపుకోలేకపోయాడు. ఈ సినిమా ఆడుతున్న ఓ మెగా థియేటర్కు వెళ్లాడు. అక్కడ ప్రేక్షకుల హంగామా మధ్య సినిమా చూశాడు. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆ వీడియో ఉద్వేగానికి గురి చేస్తోంది.
సినిమా అంటే వీళ్లందరిలో ఉన్న ప్రేమను ఉద్వేగభరితంగా చాటుకుంటున్నారు. ఈ ఏడాది వేసవిలోనే రావాల్సిన ‘టెనెట్’ కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవలే పరిస్థితులు మెరుగుపడ్డ కొన్ని దేశాల్లో విడుదలైంది. సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉందని, నోలన్ నుంచి వచ్చిన మరో క్లాసిక్ ఇదని అంటున్నారు. కరోనా పరిస్థితుల్ని సమీక్షిస్తూ.. ఒక్కో దేశంలో ఈ సినిమా విడుదల చేసుకుంటూ వెళ్లనున్నారు.ఇండియాలో కూడా దసరా సమయానికి ‘టెనెట్’ విడుదల కావచ్చని ఆశిస్తున్నారు.
This post was last modified on August 30, 2020 9:44 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…