థియేటరుకు వెళ్లి సినిమా చూడటం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి చాలా ఇష్టమైన వ్యాపకం. ఆ వ్యాపకానికి కరోనా గండి కొట్టేసింది. వారం వారం కొత్త సినిమా విడుదల కాగానే థియేటర్లకు పరుగులు పెట్టే ప్రేక్షకుల పరిస్థితి ఈ ఆరు నెలల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. కొత్త, పాత అని తేడా లేకుండా వెళ్లి ఏదో ఒక సినిమాను బిగ్ స్క్ర్రీన్ మీద చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు లెక్కే లేదు. ఇండియాలో వచ్చే నెలలోనే థియేటర్లు తెరుచుకుంటాయని అంటున్నారు. వేరే దేశాల్లో అయితే ఆల్రెడీ థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి.
కరోనా షరతుల మధ్య విజయవంతంగా సినిమాలు నడిపించేస్తున్నారు. అసలే చాలా విరామం తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. పైగా క్రిస్టఫర్ నోలన్ తీసిన మెగా మూవీ ‘టెనెట్’ విడుదలైంది. ఇక ప్రపంచ సినీ ప్రియుల ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పేదేముంది?
సామాన్య ప్రేక్షకులే కాదు.. టామ్ క్రూయిజ్ లాంటి అగ్ర కథానాయకుడు కూడా ఈ విషయంలో తన ఎగ్జైట్మెంట్ను ఆపుకోలేకపోయాడు. ఈ సినిమా ఆడుతున్న ఓ మెగా థియేటర్కు వెళ్లాడు. అక్కడ ప్రేక్షకుల హంగామా మధ్య సినిమా చూశాడు. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆ వీడియో ఉద్వేగానికి గురి చేస్తోంది.
సినిమా అంటే వీళ్లందరిలో ఉన్న ప్రేమను ఉద్వేగభరితంగా చాటుకుంటున్నారు. ఈ ఏడాది వేసవిలోనే రావాల్సిన ‘టెనెట్’ కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవలే పరిస్థితులు మెరుగుపడ్డ కొన్ని దేశాల్లో విడుదలైంది. సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉందని, నోలన్ నుంచి వచ్చిన మరో క్లాసిక్ ఇదని అంటున్నారు. కరోనా పరిస్థితుల్ని సమీక్షిస్తూ.. ఒక్కో దేశంలో ఈ సినిమా విడుదల చేసుకుంటూ వెళ్లనున్నారు.ఇండియాలో కూడా దసరా సమయానికి ‘టెనెట్’ విడుదల కావచ్చని ఆశిస్తున్నారు.
This post was last modified on August 30, 2020 9:44 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…