కొంచెం స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోకు కొడుకు పుట్టాడంటే చాలు.. ఆ పిల్లాడు కూడా హీరోనే అని ఫిక్స్ అయిపోతారు అభిమానులు. హీరోల అల్లుళ్లు, దూరపు చుట్టాలు కూడా హీరోలు అయిపోతున్న ఈ రోజుల్లో ఇక స్టార్ హీరోల కొడుకులు హీరోలు కాకుండా ఎలా ఉంటారు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అల్టిమేట్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో కొడుకు మీద అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలుంటాయో తెలిసిందే.
పవన్, రేణు దేశాయ్ల తనయుడైన అకీరా నందన్ టీనేజీలో ఉండగానే మాంచి ఫాలోయింగ్ సంపాదించేశాడు. అతను ఎప్పుడైనా బయట మీడియా కళ్లలో పడ్డాడంటే చాలు.. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అయిపోతాయి. అకీరా బర్త్డే అంటే స్టార్ హీరోల రేంజిలో అతడి పేరు ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న కుర్రాడు.. నటనలోకి రాడు అంటే అభిమానులు ఊరుకుంటారా అన్నది ప్రశ్న.
ఇప్పుడీ ప్రశ్న ఎందుకొచ్చింది అంటే.. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన రేణు దేశాయ్, దాని గురించి మీడియాతో మాట్లాడుతూ.. అకీరా గురించి ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అకీరాకు నటన మీద ఆసక్తి లేదని.. అతను డైరెక్షన్, సంగీతం లాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నాడని చెప్పింది. తాను కూడా అకీరా నటుడు కావాలని అనుకోవట్లేదని చెప్పింది. తాను కానీ, పవన్ కళ్యాణ్ కానీ అతణ్ని నటనలోకి రావాలని ఫోర్స్ చేయట్లేదని కూడా రేణు దేశాయ్ చెప్పడం గమనార్హం. ఈ మాటలు పవన్ అభిమానులకు రుచించలేదు.
అతను కాబోయే స్టార్ హీరో అని వాళ్లు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అతడి అరంగేట్రం గురించి కొన్నేళ్ల ముందు నుంచే చర్చలు సాగిస్తున్నారు. నిజంగా అకీరా నటన వద్దని డైరెక్షనో ఇంకొకటో చేసుకుంటే వాళ్లు ఊరుకుంటారా అని డౌట్. ఐతే రేణు ఇప్పుడు ఇలా అన్నా కూడా మున్ముందు ఆలోచన మారకుండా ఉండదు. చాలామంది వారసుల విషయంలో వాళ్ల తల్లిదండ్రులు ముందు ఇలాగే మాట్లాడినా.. తర్వాత హీరోగా పరిచయం చేశారు. కాబట్టి అకీరా టైం వచ్చే వరకు ఎదురు చూడాలి తప్ప ఫ్యాన్స్ మరీ కంగారు పడాల్సిన పని లేదు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…