రాబోయే శుక్రవారం అన్ని మీడియం రేంజ్ సినిమాలే తలపడుతుండటంతో బాక్సాఫీస్ యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న వాటికి అదనంగా బొమ్మరిల్లు సిద్దార్థ్ నటించిన చిన్నా తోడయ్యింది. చిత్తా పేరుతో మొన్న తమిళంలో రిలీజైన ఈ థ్రిల్లర్ కం ఎమోషనల్ డ్రామాకు అక్కడ మంచి స్పందన దక్కింది. దీనికన్నా ఎక్కువ అంచనాలు మోసుకొచ్చిన జయం రవి ఇరైవన్ ని పక్కకు తోసేసి మరీ ఆడియన్స్ ని థియేటర్లకు లాకొచ్చింది. స్కూల్ పిల్లల మీద లైంగిక వేధింపు, పోక్సో చట్టంలోని తీవ్రతను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు అరుణ్ కుమార్ దీన్ని తీర్చిద్దిదారు.
ప్రాణంగా చూసుకునే పాప కనిపించకుండా పోయి ఒక దుర్మార్గుడి చేతికి దొరికిందని తెలిసినప్పుడు నరకయాతన పడే యువకుడి పాత్రలో సిద్దు మంచి నటన ప్రదర్శించాడు. చాలా తక్కువ బడ్జెట్ లో చిన్నా రూపొందింది. అంతా బాగానే ఉంది కానీ రూల్స్ రంజన్. మామా మశ్చీంద్ర, 800, మంత్ అఫ్ మధు, మ్యాడ్, ఆపరేషన్ రాణిగంజ్, ధోనోల పోటీని తట్టుకుని ఈ జాతరలో చిన్నా గెలవడం అంత సులభంగా ఉండదు. ఆసియన్ ఫిలింస్ పంపిణీ కాబట్టి థియేటర్లు దొరుకుతాయి కానీ జనాన్ని టికెట్లు కొనేలా చేయాలంటే స్క్రీన్లు ఉంటే సరిపోదు. ఆకట్టుకునే పబ్లిసిటీ చేయాలి.
దానికంత సరిపడా టైం అయితే లేదు. ఉన్న అయిదు రోజుల్లో ఒక్కసారిగా హైప్ వచ్చేయదు. అందుకే ఒకటి రెండు రోజుల ముందు ప్రీమియర్లు వేసే ఆలోచనలో టీమ్ ఉందట. అటు సిద్దార్థ్ చూస్తేనేమో వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ని నిలబెట్టుకోవడం కోసం తమిళనాడు ప్రమోషన్లలో బాగా యాక్టివ్ అయ్యాడు. ఇటీవలే కర్ణాటక కూడా వెళ్ళొచ్చాడు. హైదరాబాద్ లోనూ ఒక ఈవెంట్ చేసి కొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్ చేసేలా సమయం లేదు మిత్రమా అంటూ చిన్నా బృందం సన్నద్ధమవుతోంది. అరవ ఆడియన్స్ ని మెప్పించిన చిన్నా తెలుగు జనాలకు ఏ మేరకు నచ్చుతాడో చూడాలి.
This post was last modified on October 1, 2023 6:34 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…