రాబోయే శుక్రవారం అన్ని మీడియం రేంజ్ సినిమాలే తలపడుతుండటంతో బాక్సాఫీస్ యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న వాటికి అదనంగా బొమ్మరిల్లు సిద్దార్థ్ నటించిన చిన్నా తోడయ్యింది. చిత్తా పేరుతో మొన్న తమిళంలో రిలీజైన ఈ థ్రిల్లర్ కం ఎమోషనల్ డ్రామాకు అక్కడ మంచి స్పందన దక్కింది. దీనికన్నా ఎక్కువ అంచనాలు మోసుకొచ్చిన జయం రవి ఇరైవన్ ని పక్కకు తోసేసి మరీ ఆడియన్స్ ని థియేటర్లకు లాకొచ్చింది. స్కూల్ పిల్లల మీద లైంగిక వేధింపు, పోక్సో చట్టంలోని తీవ్రతను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు అరుణ్ కుమార్ దీన్ని తీర్చిద్దిదారు.
ప్రాణంగా చూసుకునే పాప కనిపించకుండా పోయి ఒక దుర్మార్గుడి చేతికి దొరికిందని తెలిసినప్పుడు నరకయాతన పడే యువకుడి పాత్రలో సిద్దు మంచి నటన ప్రదర్శించాడు. చాలా తక్కువ బడ్జెట్ లో చిన్నా రూపొందింది. అంతా బాగానే ఉంది కానీ రూల్స్ రంజన్. మామా మశ్చీంద్ర, 800, మంత్ అఫ్ మధు, మ్యాడ్, ఆపరేషన్ రాణిగంజ్, ధోనోల పోటీని తట్టుకుని ఈ జాతరలో చిన్నా గెలవడం అంత సులభంగా ఉండదు. ఆసియన్ ఫిలింస్ పంపిణీ కాబట్టి థియేటర్లు దొరుకుతాయి కానీ జనాన్ని టికెట్లు కొనేలా చేయాలంటే స్క్రీన్లు ఉంటే సరిపోదు. ఆకట్టుకునే పబ్లిసిటీ చేయాలి.
దానికంత సరిపడా టైం అయితే లేదు. ఉన్న అయిదు రోజుల్లో ఒక్కసారిగా హైప్ వచ్చేయదు. అందుకే ఒకటి రెండు రోజుల ముందు ప్రీమియర్లు వేసే ఆలోచనలో టీమ్ ఉందట. అటు సిద్దార్థ్ చూస్తేనేమో వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ని నిలబెట్టుకోవడం కోసం తమిళనాడు ప్రమోషన్లలో బాగా యాక్టివ్ అయ్యాడు. ఇటీవలే కర్ణాటక కూడా వెళ్ళొచ్చాడు. హైదరాబాద్ లోనూ ఒక ఈవెంట్ చేసి కొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్ చేసేలా సమయం లేదు మిత్రమా అంటూ చిన్నా బృందం సన్నద్ధమవుతోంది. అరవ ఆడియన్స్ ని మెప్పించిన చిన్నా తెలుగు జనాలకు ఏ మేరకు నచ్చుతాడో చూడాలి.
This post was last modified on October 1, 2023 6:34 pm
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి…
వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది.…
స్టార్ హీరోల సినిమాల్లో అభిమానులు ప్రధానంగా ఆశించేది ఎలివేషన్ సీన్లు.. డ్యాన్సులు, ఫైట్లు. ఇవి ఉంటే, కథ కొంచెం అటు…
ఇటీవల టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెళ్లి వేడుక అంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలదే.…
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను…
వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు…