ఇటీవల టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెళ్లి వేడుక అంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలదే. వీళ్లిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో పాపులర్. ముఖ్యంగా బహు భాషల్లో సినిమాలతో నేషనల్ క్రష్ అని గుర్తింపు కూడా సంపాదించింది రష్మిక. విజయ్ చేసిన తెలుగు సినిమాలే వేరే భాషల్లోనూ గుర్తింపు సంపాదించాయి. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో అందరి దృష్టీ అటు వైపు నిలిచింది.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న విజయ్, రష్మిక.. వివాహానంతరం షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. అవి మామూలుగా వైరల్ కాలేదు. పెళ్లి అయ్యే వరకు గోప్యత పాటించిన విజయ్, రష్మిక.. ఆ తర్వాత మాత్రం బాగా ఓపెన్ అయిపోయారు. తమ స్వస్థలం మహబూబ్ నగర్కు వెళ్లి రష్మికతో కలిసి అక్కడ పూజలు, వేడుకల్లో పాల్గొనడమే కాక.. ఊరు మొత్తానికి భారీ విందు భోజనాలు ఏర్పాటు చేయించాడు విజయ్.
ఇప్పుడిక హైదరాబాద్లో రిసెప్షన్కు రంగం సిద్ధమైంది. దీన్ని భారీ స్థాయిలోనే చేస్తున్నప్పటికీ.. ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. చాలా జాగ్రత్తగా అతిథుల జాబితా రెడీ చేయించి.. అందరికీ ఆహ్వానాలు పంపడమే కాక, ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. పెళ్లికి వచ్చేవాళ్లు ఎంట్రీ పాయిట్ దగ్గర క్యూఆర్ కోడ్తో స్కానింగ్ అయ్యాకే లోపలికి వెళ్లాలని షరతు పెట్టారు. ఐతే సినీ, రాజకీయ ప్రముఖులు అందరికీ కచ్చితంగా ఈ షరతేమీ వర్తించకపోవచ్చు.
కానీ ఇన్విటేషన్ లేని వాళ్లు లోపలికి రాకుండా చూడడానికే ఈ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సర్వేలెన్స్లో ఈ వేడుక జరగనుందని.. ఇన్విటేషన్ ఉన్నట్లుగా ధ్రువీకరించే క్యూఆర్ కోడ్ లేకపోతే దయచేసి ఈ వేడుకకు రావొద్దని ‘విరోష్’ జోడీ స్పష్టంగా మీడియాకు నోట్ కూడా ఇచ్చింది.
పెళ్లి లాగే ఈ వేడుకకు కూడా మీడియాను దూరం పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీడియాను పిలిచినా సెలక్టివ్గానే ఉండొచ్చు. బుధవారం రిసెప్షన్ జరగనుండగా.. అక్కడికి అభిమానుల సందోహం రాకుండా ముందు రోజే విజయ్, రష్మిక ఫ్యాన్స్ మీట్ను కూడా పూర్తి చేయడం విశేషం.
This post was last modified on March 3, 2026 5:11 pm
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను…
వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు…
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే.. రాజకీయంగా కాదు.. అధికారికంగా.. పలువురు…
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ జరగనుంది. అయితే…
తెలుగు, తమిళంతో పోలిస్తే మార్కెట్, బడ్జెట్ పరంగా వెనుకబడి ఉన్న కన్నడ పరిశ్రమను ఒకేసారి పది మెట్లు ఎక్కించిన సినిమా…
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ…