దసరా పండగ సందర్భంగా భగవంత్ కేసరితో పాటు అక్టోబర్ 19 విడుదల కాబోతున్న విజయ్ లియో మీద తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. పోస్టర్ల విషయంలో కొంత ట్రోలింగ్ ఎదురవుతున్నప్పటికీ రిలీజ్ నాటికి పరిస్థితిలో ఊహించని మార్పు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒవర్సీస్ బయ్యర్లు నలభై రోజుల ముందే యుకెలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టడం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. తెలుగుతో కలిపి ముప్పై వేల టికెట్లు అమ్ముడుపోయినట్టు స్థానిక డిస్ట్రిబ్యూటర్ అఫీషియల్ గానే ప్రకటించారు.
ఇదిలా ఉండగా లియో కథని 2005లో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసుకున్నట్టు చెన్నై గాసిప్. దాని పేరు ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్. ఇది 1997లో జాన్ వానర్-విన్సీ లాక్ సంయుక్తంగా రాసిన నవల ఆధారంగా తీసినది. కథ చూస్తే హీరో భార్యాపిల్లలతో ఒక రెస్టారెంట్ నడుపుతుంటాడు . ఇద్దరు రౌడీలు వచ్చి ఓ మహిళా ఉద్యోగిని అల్లరి చేయబోతే వాళ్ళను చంపేస్తాడు. అప్పుడో వ్యక్తి వచ్చి నువ్వు సామాన్యుడివి కాదని, పెద్ద మాఫియా సామ్రాజ్యంతో సంబంధం ఉందని గతాన్ని వివరిస్తాడు. అదంతా కొట్టి పారేసిన హీరో తర్వాత నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్ లో భారీ ఫైట్లు ఛేజులతో సాగుతుంది.
ఇది నిజమని చెప్పేందుకు ఆధారాలు లేవు కానీ టీజర్ తో పోల్చుకుని చూస్తే కొట్టిపారేయలేని విధంగా ఉంది. ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ అప్పట్లో మంచి విజయం సాధించింది. స్క్రీన్ ప్లే ఇంటెలిజెంట్ గా పేరున్న లోకేష్ కనగరాజ్ తనదైన హీరోయిజం ఎలివేషన్లతో ఇలాంటి స్టోరీని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో వేరే చెప్పాలా. ఒరిజినల్ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో విడుదల కాబోతున్న లియో రజనీకాంత్ జైలర్ రికార్డులను టార్గెట్ గా పెట్టుకుంది. వెయ్యి కోట్లను సాధించే సత్తా కూడా ఉందని ఫ్యాన్స్ తెగ ఊహించేసుకుంటున్నారు. తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ కు సితార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
This post was last modified on September 26, 2023 8:19 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…