చాలా చిన్న వయసులో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇంకా శాటిలైట్ ఛానల్స్ అప్పుడప్పుడే ఎదుగుతున్న టైంలో మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి స్వాతి రెడ్డి. ప్రోగ్రామే ఇంటి పేరుగా మారిపోయే రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చి సినిమాలూ చేసింది. వాటిలో బాగా చెప్పుకోదగినది అష్టా చెమ్మా. మహేష్ బాబు వీరాభిమానిగా అందులో ఆమె చూపించిన నటన మాములుది కాదు. ఆరేళ్ళ క్రితం లండన్ బాబులు చేసింది కానీ అది ఫ్లాప్ కావడంతో గ్యాప్ తీసుకుంది. ఇటీవలే పంచతంత్రం అనే మూవీ థియేటర్లలో ఆడకపోయినా ఓటిటిలో బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది.
తిరిగి ఇప్పుడు మంత్ అఫ్ మధుతో అక్టోబర్ 6న హీరో నవీన్ చంద్రతో కలిసి థియేటర్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఈ సందర్భంగా సాయి తేజ్ అతిథిగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్న ఎదురైతే నిర్మొహమాటంగా నే చెప్పను కాక చెప్పను అని తెగేసి బదులు ఇవ్వడం మీడియాని ఆశ్చర్యానికి గురి చేసింది. విడాకుల వ్యవహారం సాధారణ విషయమే అయినా దానికి సినిమాకి సంబంధం లేదు కాబట్టి ఆ ప్రస్తావనే తేవొద్దనేలా సమాధానం చెప్పిన తీరు సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది. నే చెప్పా అంటూ పదే పదే కౌంటరివ్వడం పేలింది.
తారల వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టమైనా నలుగురి ముందుకు వచ్చినప్పుడు అన్ని రకాల విషయాలు చర్చకు వస్తాయి. స్వాతి చెప్పిన విధానం కొంత హార్ష్ గా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చెబితే తప్ప అర్థం చేసుకోరు కాబట్టి తప్పలేదేమో. చిన్న సినిమాలతో పోటీ పడనున్న మంత్ అఫ్ మధుకి స్టార్ క్యాస్టింగ్ లేదు. శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించగా ఘట్టమనేని మంజుల, వైవా హర్ష, రాజా రవీంద్ర, రుచిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తయి నెలలు గడిచినప్పటికీ ఫైనల్ గా మోక్షం దక్కించుకుంది. నవీన్ చంద్ర, స్వాతిరెడ్డిల జోడి ఎలా మెప్పించబోతోందో చూడాలి.
This post was last modified on September 26, 2023 4:34 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…