చాలా చిన్న వయసులో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇంకా శాటిలైట్ ఛానల్స్ అప్పుడప్పుడే ఎదుగుతున్న టైంలో మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి స్వాతి రెడ్డి. ప్రోగ్రామే ఇంటి పేరుగా మారిపోయే రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చి సినిమాలూ చేసింది. వాటిలో బాగా చెప్పుకోదగినది అష్టా చెమ్మా. మహేష్ బాబు వీరాభిమానిగా అందులో ఆమె చూపించిన నటన మాములుది కాదు. ఆరేళ్ళ క్రితం లండన్ బాబులు చేసింది కానీ అది ఫ్లాప్ కావడంతో గ్యాప్ తీసుకుంది. ఇటీవలే పంచతంత్రం అనే మూవీ థియేటర్లలో ఆడకపోయినా ఓటిటిలో బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది.
తిరిగి ఇప్పుడు మంత్ అఫ్ మధుతో అక్టోబర్ 6న హీరో నవీన్ చంద్రతో కలిసి థియేటర్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఈ సందర్భంగా సాయి తేజ్ అతిథిగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్న ఎదురైతే నిర్మొహమాటంగా నే చెప్పను కాక చెప్పను అని తెగేసి బదులు ఇవ్వడం మీడియాని ఆశ్చర్యానికి గురి చేసింది. విడాకుల వ్యవహారం సాధారణ విషయమే అయినా దానికి సినిమాకి సంబంధం లేదు కాబట్టి ఆ ప్రస్తావనే తేవొద్దనేలా సమాధానం చెప్పిన తీరు సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది. నే చెప్పా అంటూ పదే పదే కౌంటరివ్వడం పేలింది.
తారల వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టమైనా నలుగురి ముందుకు వచ్చినప్పుడు అన్ని రకాల విషయాలు చర్చకు వస్తాయి. స్వాతి చెప్పిన విధానం కొంత హార్ష్ గా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చెబితే తప్ప అర్థం చేసుకోరు కాబట్టి తప్పలేదేమో. చిన్న సినిమాలతో పోటీ పడనున్న మంత్ అఫ్ మధుకి స్టార్ క్యాస్టింగ్ లేదు. శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించగా ఘట్టమనేని మంజుల, వైవా హర్ష, రాజా రవీంద్ర, రుచిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తయి నెలలు గడిచినప్పటికీ ఫైనల్ గా మోక్షం దక్కించుకుంది. నవీన్ చంద్ర, స్వాతిరెడ్డిల జోడి ఎలా మెప్పించబోతోందో చూడాలి.
This post was last modified on September 26, 2023 4:34 pm
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…