Movie News

కలర్స్ స్వాతి సమాధానం పేలిందిగా

చాలా చిన్న వయసులో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇంకా శాటిలైట్ ఛానల్స్ అప్పుడప్పుడే ఎదుగుతున్న టైంలో మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి స్వాతి రెడ్డి. ప్రోగ్రామే ఇంటి పేరుగా మారిపోయే రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చి సినిమాలూ చేసింది. వాటిలో బాగా చెప్పుకోదగినది అష్టా చెమ్మా. మహేష్ బాబు వీరాభిమానిగా అందులో ఆమె చూపించిన నటన మాములుది కాదు. ఆరేళ్ళ క్రితం లండన్ బాబులు చేసింది కానీ అది ఫ్లాప్ కావడంతో గ్యాప్ తీసుకుంది. ఇటీవలే పంచతంత్రం అనే మూవీ థియేటర్లలో ఆడకపోయినా ఓటిటిలో బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది.

తిరిగి ఇప్పుడు మంత్ అఫ్ మధుతో అక్టోబర్ 6న హీరో నవీన్ చంద్రతో కలిసి థియేటర్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఈ సందర్భంగా సాయి తేజ్ అతిథిగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్న ఎదురైతే నిర్మొహమాటంగా నే చెప్పను కాక చెప్పను అని తెగేసి బదులు ఇవ్వడం మీడియాని ఆశ్చర్యానికి గురి చేసింది. విడాకుల వ్యవహారం సాధారణ విషయమే అయినా దానికి సినిమాకి సంబంధం లేదు కాబట్టి ఆ ప్రస్తావనే తేవొద్దనేలా సమాధానం చెప్పిన తీరు సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది. నే చెప్పా అంటూ పదే పదే కౌంటరివ్వడం పేలింది.

తారల వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టమైనా నలుగురి ముందుకు వచ్చినప్పుడు అన్ని రకాల విషయాలు చర్చకు వస్తాయి. స్వాతి చెప్పిన విధానం కొంత హార్ష్ గా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చెబితే తప్ప అర్థం చేసుకోరు కాబట్టి తప్పలేదేమో. చిన్న సినిమాలతో పోటీ పడనున్న మంత్ అఫ్ మధుకి స్టార్ క్యాస్టింగ్ లేదు. శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించగా ఘట్టమనేని మంజుల, వైవా హర్ష, రాజా రవీంద్ర, రుచిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తయి నెలలు గడిచినప్పటికీ ఫైనల్ గా మోక్షం దక్కించుకుంది. నవీన్ చంద్ర, స్వాతిరెడ్డిల జోడి ఎలా మెప్పించబోతోందో చూడాలి. 

This post was last modified on September 26, 2023 4:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

45 minutes ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

55 minutes ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

1 hour ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

3 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

3 hours ago