పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కెరీర్లో మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ అంటే.. ఖుషినే. పవన్కు వేరే బ్లాక్బస్టర్లు ఉన్నప్పటికీ.. దీన్ని అభిమానులు చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఇది రీమేక్ మూవీనే అయినప్పటికీ.. ఒరిజినల్తో పోలిస్తే ఇంకా బాగుంటుంది. తమిళంలో ఖుషి సూపర్ హిట్ అని, మొదట్లో దానికి డివైడ్ టాక్ వచ్చిందని.. కానీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిందని.. తొలి షో నుంచే ఇది చాలా పెద్ద రేంజికి వెళ్లిందని.. తెలుగులో సినిమా ఆ రేంజికి వెళ్లడానికి కారణం పవన్ కళ్యాణే అని స్వయంగా దర్శకుడు ఎస్.జె.సూర్యనే చెప్పడం గమనార్హం.
ఇందులో క్రియేటివ్గా సాగే యాక్షన్ సీక్వెన్సులు, యే మేరా జహాన్ పాట పవన్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే అన్న సంగతి తెలిసిందే. ఇది కూడా స్వయంగా సూర్యనే వెల్లడించాడు. ఐతే వీటితో పాటు మరో సన్నివేశం పవన్ సెట్లో కూర్చుని అప్పటికప్పుడు క్రియేట్ చేసిన విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. క్లైమాక్సులో గుడుంబా సత్తిని కలిసే ముందు పవన్ ఒక కామెడీ ఫైట్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. అందులో కమెడియన్ బబ్లూ కూడా చిన్న రోల్ చేశాడు.
చాలా చమత్కారంగా సాగుతుందా సీక్వెన్స్. ఈ సీన్ నిజానికి ముందు స్క్రిప్టులో లేదట. ఐతే బబ్లూకు ఎలాగైనా ఈ సినిమాలో చిన్న పాత్ర ఇవ్వాలని అనుకుని.. పవనే సెట్లో కూర్చుని ఆ సీన్ రాశాడట. ముందు బబ్లూ కోసం సీన్ పెట్టాలని పవన్ అంటే.. ఇక్కడ ఇరికించడం సాధ్యం కాదని అన్నాడట సూర్య. కానీ పవన్ ఎలాగైనా అతణ్ని పెట్టాలని ఆలోచించి మరుసటి రోజు షూటింగ్కు రమ్మని బబ్లూకు చెప్పాడట. అతను వచ్చే సమయానికి సెట్లో కూర్చుని పవన్ ఈ సీన్ రాసి.. అప్పటికప్పుడు షూట్ చేయించినట్లు బబ్లూ ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
This post was last modified on September 26, 2023 12:28 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…