బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి. అసలే మునిసిపల్ ఎన్నికల్లో కనీసం రెండు పదుల సంఖ్యలో కూడా స్థానాలు దక్కించుకోలేదన్న ఆవేదనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఇలాంటి సమయంలో మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తమ విధులకు అడ్డు పడ్డారని.. తమ వారిపై దౌర్జన్యం చేశారని.. పోలీసులు బాల్క సుమన్పై ఫిర్యాదు నమోదు చేసి.. తాజాగా అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ ఘటనతో బీఆర్ఎస్ నాయకులు మరింత ఆవేదన, ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని.. వ్యాఖ్యానించిన మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీసులను కూడా ఆయన హెచ్చరించారు. సుమన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసులను కూడా వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీని కుట్రపూరితంగా.. అడ్డదారుల్లో కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజలు ఒక్కరికే శాశ్వతంగా పట్టకట్టబోరన్న కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించి తీరుతామని వ్యాఖ్యానించారు. అప్పుడు ఇంతకు ఇంత వడ్డీతో సహా తీర్చుకుం టామని హెచ్చరించారు.
కాన్వాయ్ను అడ్డుకున్నారా?
క్యాతనపల్లి ఘటనపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్కు మెజారటీ వచ్చిందని ఆ పార్టీ సభ్యులు చెబుతున్నారు. కాదు.. బీఆర్ ఎస్కు మాత్రమే స్పష్టమైన మెజారిటీ వచ్చిందని.. ఎక్స్ అఫిషియో సభ్యుడి పేరుతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిందని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది.
మరోవైపు.. బాల్క సుమన్.. తమపై దాడి చేశారని పోలీసులు చెబుతుండగా.. అధికార పార్టీ మాత్రం.. తమ మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్క దాడి చేశారని అందుకే.. పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. మరోవైపు బీఆర్ ఎస్ క్యాతనపల్లి బంద్కు పిలుపునిచ్చింది.14 రోజుల రిమాండ్..
పోలీసుల విధులను అడ్డుకున్నారన్న కేసులో బాల్క సుమన్ సహా.. నలుగురికి మంచిర్యాల కోర్టు 14 రోజు ల రిమాండ్ విధించింది. క్యాతనపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన వివాదంలో పోలీసులపై దౌర్జన్యం చేశారని.. స్థానిక శ్రీరాంపురం పోలీసు స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.
This post was last modified on February 18, 2026 8:29 pm
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…