బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో ఒక సౌత్ డైరెక్టర్ వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ సాధించడం ఖచ్చితంగా చిన్న విషయం కాదు. అలా అని జవాన్ ని ఎవరూ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ అనరు. షోలే, డిడిఎల్ సరసన నిలబెట్టరు. ఒక ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజీని కింగ్ ఖాన్ మోసిన విధానం, వందల కోట్లను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిన వైనం వీటిని మించి దర్శకుడు అట్లీ ప్రతిభ వెరసి ఇంత పెద్ద ఘనవిజయాన్ని సమకూర్చి పెట్టాయి. ఇప్పుడేదో ఫ్లోలో ఎగబడి చూసేశారు కానీ ఓ రెండేళ్ల తర్వాత మళ్ళీ షో వేసుకుంటే ఇంత రొటీన్ బొమ్మ ఎలా ఆడిందనే సందేహం కలిగినా ఆశ్చర్యం లేదు.
అయితే ఈ విజయం అట్లీతో మరీ అతిశయోక్తిగా మాట్లాడిస్తోందని ముంబై మీడియా వర్గాలు అతని మాటలను ఉటంకిస్తున్నాయి. జవాన్ ని ఆస్కార్ కు పంపే ఆలోచనలో ఉన్నామని చెప్పడం దీనికి పునాది వేసింది. ఎంత హిట్ అయినా సరే మరీ అకాడెమి అవార్డుకి అర్హత సాధించేంత మ్యాటర్ జవాన్ లో లేదని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ఇది చాలాక తనకు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పిలుపులు వచ్చాయని, ఇదంతా జవాన్ వల్లేనని తాజాగా మరో ఇంటర్వ్యూలో అన్నాడు. దీంతో అట్లీ వాస్తవిక కోణంలో ఆలోచించడం లేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్ లాంటి ఐకాన్ స్టార్లు తనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న టైంలో వీలైనంత డౌన్ టు ఎర్త్ ఉండటం అవసరం. ఆర్ఆర్ఆర్, బాహుబలి ఫలితాలు వచ్చాక కూడా రాజమౌళి మౌనమునిలా తన పని తాను చేసుకుంటూ పోయాడు తప్పించి ఎక్కడా తన సినిమాలకు ఈ స్థాయి ఉందని, ఖచ్చితంగా ఫలానాది సాధిస్తామని చెప్పలేదు. మొత్తం తెరవెనుక నడిపించారు. అట్లీ అంటే దుడుకుతనం కాబట్టి కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతుండొచ్చు కానీ కమర్షియల్ గా తాను కొత్తగా ఆలోచించడం లేదన్న కామెంట్స్ కి నెక్స్ట్ ఇండియా సినిమాతో అయినా సమాధానం ఇవ్వడం అవసరం.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…