టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబు నాయుడి అరెస్టుతో నిలిపివేసిన యువగళం పాదయాత్రను లోకేష్ తిరిగి ప్రారంభించనున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తూనే.. మరోవైపు యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి బాబు అరెస్టును మరింతగా తీసుకెళ్లేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారని తెలిసింది. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించే ఆలోచనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని 100 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయడం సహా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి 23న లోకేష్ యువగళం యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ లోకేష్ సాగారు. ఈ యాత్ర 200 రోజులు, 2700 కిలోమీటర్లు దాటింది. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న సీఐడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఏసీబీ కోర్టు బాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామమిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.
అనంతరం ఢిల్లీ వెళ్లిన లోకేష్ జాతీయ స్థాయిలో బాబు అరెస్టును చర్చనీయాంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. మరోవైపు బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సుప్రీం కోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చిస్తున్నారు. ఇప్పుడేమో అటు న్యాయ పోరాటం కొనసాగిస్తూనే.. ఇటు యువగళం పాదయాత్ర తిరిగి చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు. పాదయాత్ర నిలిచిన రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించనున్నారు.
This post was last modified on September 24, 2023 4:43 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…