మాములుగా ఒక పెద్ద సినిమాకు హిట్ టాక్ వస్తే కనీసం వారం రోజుల పాటు దానికి మంచి రన్ దక్కుతుంది. కానీ ఖుషి విషయంలో మాత్రం ఇది రివర్స్ జరిగింది. ఫస్ట్ వీకెండ్ దాటడం ఆలస్యం డెబ్భై కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ప్రకటించిన నిర్మాతలు ఆ తర్వాత సోమవారం నుంచి నమోదైన డ్రాప్ చూసి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. సక్సెస్ మీట్ చేసి కుటుంబానికో లక్ష చొప్పున కోటి రూపాయలు పంచిన విజయ్ దేవరకొండకు ఆ ఆనందమైతే మిగిలింది కానీ గీత గోవిందం రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఆశలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆవిరైపోయాయి.
ఎంత లేదన్నా పన్నెండు కోట్ల దాకా ఖుషి థియేట్రికల్ లాస్ మిగిలించిందని ట్రేడ్ టాక్. ఇదిలా ఉండగా నెల తిరగడం ఆలస్యం ఇప్పుడిది ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్య పెద్దగా వర్కౌట్ కాని భారీ చిత్రాల విషయంలో సదరు ఓటిటి ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటోంది. ఇటీవలే భోళా శంకర్. ఇవాళ గాండీవధారి అర్జున గుట్టుచప్పుడు కాకుండా వచ్చేశాయి, చాలా తక్కువ గ్యాప్ లో వీటిని డిజిటల్ లో వదలడం గమనించాల్సిన విషయం.
ఒకప్పుడేమో కానీ ఇప్పుడు కొత్త సినిమాలు నెల లోపే డిజిటల్ బాట పట్టడం చాలా మాములు విషయమైపోయింది. అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన జైలర్ సైతం మినహాయింపుగా నిలవలేదు. చాలా చోట్ల మంచి వసూళ్లు వస్తున్నా సరే సన్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేసి ముప్పై రోజులకే స్మార్ట్ స్క్రీన్ మీదకు వదిలేసింది. ఇకపై కూడా ఈ ట్రెండ్ కొనసాగనుంది. గత ఏడాది నుంచి కనీసం ఎనిమిది వారాల గ్యాప్ నిబంధనను అమలు చేయాలనుకున్న నిర్మాతల సమాఖ్యలో సభ్యులే దానికి కట్టుబడలేక వదిలేశారు. ఇక చోటా ప్రొడ్యూసర్ల సంగతి సరేసరి. అది పాటించడం జరిగే పని కాదని అర్థమైపోయింది.
This post was last modified on September 24, 2023 1:13 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…