ట్విట్టర్లో టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఐతే ముందుకొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్లు.. ఎన్నో ఏళ్లుగా ఉన్న యువ కథానాయకుల కంటే ఈ ఏడాది మార్చిలో ట్విట్టర్లోకి అడుగు పెట్టిన చిరంజీవే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. తరచుగా ట్వీట్లు వేస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నారు. ఆ ట్వీట్లు కూడా మొక్కుబడిగా ఏమీ ఉండట్లేదు.
చిరు చమత్కారాన్ని, ఉత్సాహాన్ని, సామాజిక బాధ్యతను, సేవా భావాన్ని చాటేవిగా ఉంటున్నాయి. ఐతే ట్విట్టర్లో చిరు ఉత్సాహం చూసి చాలామందికి ఒక సందేహం కలిగింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్ను ఆయన స్వయంగా మెయింటైన్ చేయట్లేదని.. దీని నిర్వహణ కోసం ఒకరిద్దరితో టీంను పెట్టుకుని ఉండొచ్చని చాలామంది అన్నారు. ఐతే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నాడు. చిరు సొంతంగానే తన ట్విట్టర్ అకౌంట్ను మేనేజ్ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
“నాన్నగారు ట్విట్టర్లోకి రాబోతుండగానే ‘బీ అవేర్ చరణ్. ఐయామ్ కమింగ్ హియర్’ అని నాతో అన్నారు. ఆ తరం వాళ్లకి సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి మనకు పెద్దగా తెలియదు. వారికి చెప్పే అవకాశమూ రాలేదు. అయితే ఇప్పుడు ఆ అవకాశం రావడంతో నాన్న గారు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి మేనేజర్ లేకుండా నేరుగా ఆయనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు.
లాక్ డౌన్లో ఆయన ట్వీట్లతో అభిమానులు కూడా బాగానే ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇక సోషల్ మీడియాలో ఆయన నన్ను డామినేట్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఎంతమాత్రం లేదు. సైలెంటుగా ఉండటంలో నాన్న గారికి కంఫర్ట్ అనిపించదు. అలా ఉండటానికి ఇబ్బంది పడతారు. నేను నాన్న లాగా ఎక్కువ మాట్లాడితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో నా కంఫర్ట్లో నేనుంటున్నాను. నాన్న గారి ట్వీట్లను మాత్రం అభిమానుల్లాగే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా” అని చరణ్ తెలిపాడు.
This post was last modified on August 23, 2020 3:30 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…