ఆగస్టు 22.. మెగా అభిమానులకు ఇంతకంటే పెద్ద పండుగ రోజు మరొకటి ఉండదు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనపై అభిమానులు ఈ రోజున ఏ స్థాయిలో ప్రేమను కురిపిస్తారో అందరికీ తెలిసిందే. చిరు రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరంగా ఉన్నపుడు కాస్త సందడి తగ్గింది కానీ.. రీఎంట్రీ ఇచ్చాక మాత్రం ఏటా ఈ రోజు సంబరాలు ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఈ సారి కూడా ఏమాత్రం హంగామా తగ్గేది కాదు కానీ.. కరోనా దెబ్బతో అందుకు అవకాశం లేకపోయింది. బయట పుట్టిన రోజు వేడుకలేమీ లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సంబరాలు మామూలుగా లేవు. నిన్న సాయంత్రం నుంచి చిరు అభిమానుల హంగామా మామూలుగా లేదు. దశాబ్దాలుగా చిరు తమనెలా అలరిస్తాడో వివరిస్తూ లక్షల మంది అదిరిపోయే పోస్టులు పెట్టి చిరుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సెలబ్రెటీలు కూడా ఉదయం నుంచి చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలో పోటీ పడుతున్నారు. ఐతే మిగతా వాళ్లందరూ శుభాకాంక్షలు చెప్పడం, చిరును పొగడ్డం ఒకెత్తయితే.. భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్, భారత రత్న సచిన్ టెండుల్కర్ సైతం చిరుకు విషెస్ చెప్పడం మరో ఎత్తు. చిరును తాను హైదరాబాద్లో ఆయన ఇంట్లో కలిసినప్పటి ఫొటోను షేర్ చేసిన సచిన్.. ‘‘ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, దయతో ఉండే చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరెప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలి’’ అని ట్వీట్ చేశాడు. చిరు ట్విట్టర్ హ్యాండిల్ను సైతం ట్యాగ్ చేశాడు. సచినంతటివాడు చిరు పుట్టిన రోజును గుర్తుంచుకుని ఇలా ట్వీట్ వేయడంతో మెగా అభిమానుల సంబరం మామూలుగా లేదు. దీన్ని రీట్వీట్ చేసి, స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తూ అదీ చిరు రేంజ్ అని చాటుతున్నారు. చిరు-సచిన్ ఐఎస్ఎల్ ఫుట్బాల్ టీం కేరళ బ్లాస్టర్స్లో భాగస్వాములన్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 22, 2020 9:08 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…