Movie News

కోలీవుడ్లో బెనిఫిట్ షోల పంచాయితి

స్టార్ హీరోల కొత్త సినిమాల రిలీజప్పుడు తెల్లవారకుండానే చూసే బెనిఫిట్ షోలకు అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వేల రూపాయలు పోసైనా సరే టికెట్లను కొనేందుకు వెనుకాడరు. ఇది సౌత్ లో విపరీతంగా ఉంటుంది. అయితే తమిళనాడు సర్కారు వీటిని నియంత్రించే దిశగా ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్లకు మంగళం పాడేసి ఉదయం 9 గంటల నుంచి మాత్రమే షోలు మొదలుపెట్టాలనే నిబంధన అమలు చేస్తోంది. రజనీకాంత్ జైలర్ కు సైతం ఇది తప్పలేదు. చెన్నై కన్నా ముందు హైదరాబాద్ లో స్క్రీనింగ్ జరగడం ఇదే మొదటిసారని జనాలు మాట్లాడుకున్నారు.

ఇప్పుడిది మూవీ లవర్స్ లో స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెస్తోంది. వచ్చే నెల లియో రిలీజ్ ఉంది. దానికి కూడా ఇదే రూల్ ఉంటుందని ముందుగానే సంకేతాలు ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్ అసోసియేషన్లు భగ్గుమంటున్నాయి. కావాలని అణిచేస్తున్నారని, దీన్ని ఎంత మాత్రం సహించమని తెగేసి చెబుతున్నారు. పోలీసులు మాత్రం మితిమీరిన అల్లరి, శబ్దాలతో బెనిఫిట్ షోలను పెద్ద రభసగా మార్చేస్తున్నారని, వీటి వల్ల వేలాది పోలీసులను బందోబస్తుకి కేటాయించడం పెద్ద సమస్యగా మారిందని అందుకే ఇవి లేకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అగ్ర హీరోలు, నిర్మాతలు దీని పట్ల సైలెంట్ గా ఉన్నారు కానీ ఒకవేళ ఈ బెనిఫిట్ షోలు కనక శాశ్వతంగా కనుమరుగైతే కోట్లలో డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం 4 గంటలకు రెండు వేలు పలికే టికెట్ తొమ్మిది దాటితే అయిదు వందలు మించి పోదు. అలా వేలాది షోల నుంచి ఎంతో సొమ్ము పోతుందో ఊహించుకోవచ్చు. స్టాలిన్ మాత్రం ససేమిరా అంటున్నారట. కర్ణాటకలో లేని సమస్య ఇక్కడ మాత్రం ఎందుకు వస్తుందనేది ఫ్యాన్స్ వాదన. ఏపీ, తెలంగాణలోనూ ఇవి దాదాపుగా తగ్గిపోయిన నేపథ్యంలో మెల్లగా లేట్ షోలకు అలవాటు పడటం మంచిదేమో. 

This post was last modified on September 15, 2023 8:37 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

27 mins ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

2 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

3 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

4 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

4 hours ago

తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ…

10 hours ago