స్టార్ హీరోల కొత్త సినిమాల రిలీజప్పుడు తెల్లవారకుండానే చూసే బెనిఫిట్ షోలకు అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వేల రూపాయలు పోసైనా సరే టికెట్లను కొనేందుకు వెనుకాడరు. ఇది సౌత్ లో విపరీతంగా ఉంటుంది. అయితే తమిళనాడు సర్కారు వీటిని నియంత్రించే దిశగా ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్లకు మంగళం పాడేసి ఉదయం 9 గంటల నుంచి మాత్రమే షోలు మొదలుపెట్టాలనే నిబంధన అమలు చేస్తోంది. రజనీకాంత్ జైలర్ కు సైతం ఇది తప్పలేదు. చెన్నై కన్నా ముందు హైదరాబాద్ లో స్క్రీనింగ్ జరగడం ఇదే మొదటిసారని జనాలు మాట్లాడుకున్నారు.
ఇప్పుడిది మూవీ లవర్స్ లో స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెస్తోంది. వచ్చే నెల లియో రిలీజ్ ఉంది. దానికి కూడా ఇదే రూల్ ఉంటుందని ముందుగానే సంకేతాలు ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్ అసోసియేషన్లు భగ్గుమంటున్నాయి. కావాలని అణిచేస్తున్నారని, దీన్ని ఎంత మాత్రం సహించమని తెగేసి చెబుతున్నారు. పోలీసులు మాత్రం మితిమీరిన అల్లరి, శబ్దాలతో బెనిఫిట్ షోలను పెద్ద రభసగా మార్చేస్తున్నారని, వీటి వల్ల వేలాది పోలీసులను బందోబస్తుకి కేటాయించడం పెద్ద సమస్యగా మారిందని అందుకే ఇవి లేకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అగ్ర హీరోలు, నిర్మాతలు దీని పట్ల సైలెంట్ గా ఉన్నారు కానీ ఒకవేళ ఈ బెనిఫిట్ షోలు కనక శాశ్వతంగా కనుమరుగైతే కోట్లలో డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం 4 గంటలకు రెండు వేలు పలికే టికెట్ తొమ్మిది దాటితే అయిదు వందలు మించి పోదు. అలా వేలాది షోల నుంచి ఎంతో సొమ్ము పోతుందో ఊహించుకోవచ్చు. స్టాలిన్ మాత్రం ససేమిరా అంటున్నారట. కర్ణాటకలో లేని సమస్య ఇక్కడ మాత్రం ఎందుకు వస్తుందనేది ఫ్యాన్స్ వాదన. ఏపీ, తెలంగాణలోనూ ఇవి దాదాపుగా తగ్గిపోయిన నేపథ్యంలో మెల్లగా లేట్ షోలకు అలవాటు పడటం మంచిదేమో.
This post was last modified on September 15, 2023 8:37 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…