స్టార్ హీరోల కొత్త సినిమాల రిలీజప్పుడు తెల్లవారకుండానే చూసే బెనిఫిట్ షోలకు అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వేల రూపాయలు పోసైనా సరే టికెట్లను కొనేందుకు వెనుకాడరు. ఇది సౌత్ లో విపరీతంగా ఉంటుంది. అయితే తమిళనాడు సర్కారు వీటిని నియంత్రించే దిశగా ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్లకు మంగళం పాడేసి ఉదయం 9 గంటల నుంచి మాత్రమే షోలు మొదలుపెట్టాలనే నిబంధన అమలు చేస్తోంది. రజనీకాంత్ జైలర్ కు సైతం ఇది తప్పలేదు. చెన్నై కన్నా ముందు హైదరాబాద్ లో స్క్రీనింగ్ జరగడం ఇదే మొదటిసారని జనాలు మాట్లాడుకున్నారు.
ఇప్పుడిది మూవీ లవర్స్ లో స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెస్తోంది. వచ్చే నెల లియో రిలీజ్ ఉంది. దానికి కూడా ఇదే రూల్ ఉంటుందని ముందుగానే సంకేతాలు ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్ అసోసియేషన్లు భగ్గుమంటున్నాయి. కావాలని అణిచేస్తున్నారని, దీన్ని ఎంత మాత్రం సహించమని తెగేసి చెబుతున్నారు. పోలీసులు మాత్రం మితిమీరిన అల్లరి, శబ్దాలతో బెనిఫిట్ షోలను పెద్ద రభసగా మార్చేస్తున్నారని, వీటి వల్ల వేలాది పోలీసులను బందోబస్తుకి కేటాయించడం పెద్ద సమస్యగా మారిందని అందుకే ఇవి లేకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అగ్ర హీరోలు, నిర్మాతలు దీని పట్ల సైలెంట్ గా ఉన్నారు కానీ ఒకవేళ ఈ బెనిఫిట్ షోలు కనక శాశ్వతంగా కనుమరుగైతే కోట్లలో డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం 4 గంటలకు రెండు వేలు పలికే టికెట్ తొమ్మిది దాటితే అయిదు వందలు మించి పోదు. అలా వేలాది షోల నుంచి ఎంతో సొమ్ము పోతుందో ఊహించుకోవచ్చు. స్టాలిన్ మాత్రం ససేమిరా అంటున్నారట. కర్ణాటకలో లేని సమస్య ఇక్కడ మాత్రం ఎందుకు వస్తుందనేది ఫ్యాన్స్ వాదన. ఏపీ, తెలంగాణలోనూ ఇవి దాదాపుగా తగ్గిపోయిన నేపథ్యంలో మెల్లగా లేట్ షోలకు అలవాటు పడటం మంచిదేమో.
This post was last modified on September 15, 2023 8:37 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…