మాములుగా ఏ భాషలో అయినా నటీనటులకు, నిర్మాతకు ఉన్న సంబంధం పారితోషికం వరకే ఉంటుంది. చెల్లింపులు పూర్తయ్యే విషయంలో ఇద్దరూ చాలా పర్టికులర్ గా ఉంటారు. అయితే సినిమా రిలీజయ్యాక కోట్ల రూపాయలు లాభాలు వచ్చినా ప్రొడ్యూసర్లు అందులో నుంచి వాటాలు తీసివ్వడం కానీ, పంచడం కానీ ఉండదు. అలాగే ఒకవేళ డిజాస్టర్ అయ్యి నష్టం వస్తే దానికి పనిచేసిన వాళ్ళు సొమ్ములు తగ్గించుకోవడమూ ఉండదు. ఇది బిజినెస్ మోడల్. ఇలాగే ఉంటుంది. కొందరు మాత్రం వీటికి మినహాయింపుగా తమకు అదనంగా వచ్చిన దాంట్లో పంచుకోవాలని చూస్తారు.
జైలర్ నిర్మాత దయానిధి మారన్ గురించి ఈ విషయంగానే సౌత్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈయన ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ లకు కోటికి పైగా విలువ చేసే ఖరీదైన కార్లు ఇవ్వడమే కాక భారీ మొత్తంలో చెక్కులు కూడా సమర్పించారు. ఇవి రెమ్యునరేషన్లకు సంబంధం లేకుండా. జైలర్ యూనిట్ లో పని చేసిన ప్రతి ఒక్కరికి డిపార్ట్ మెంట్ కి తగ్గట్టు వాళ్ళ పనిని గుర్తించి ఒక్కొక్కరి అకౌంట్ లోకి 50 వేల నుంచి లక్ష రూపాయల దాకా నేరుగా జమచేసినట్టు చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.
ఇదంతా చెప్పకుండా ఇచ్చిన కానుకలు. గతంలో టాలీవుడ్ లోనూ ఇలాంటివి జరిగాయి. పూరి జగన్నాధ్, కొరటాల శివ, సాయి రాజేష్, మారుతీ లాంటి వాళ్లకు ఈ తరహాలో గిఫ్ట్స్ వచ్చాయి కానీ మొత్తం టీమ్ అందుకున్న దాఖలాలు మాత్రం బయట ప్రపంచానికి తెలిసినవి లేవు. దయానిధి మారన్ లాగా అందరూ ఆలోచిస్తే బాగుండునని అనుకుంటాం కానీ ఆయనంటే వేల కోట్ల వివిధ వ్యాపారాల సామ్రాజ్యానికి అధిపతి కాబట్టి ఇలా చేసే ఛాన్స్ ఉంటుంది కానీ తలను తాకట్టు పెట్టి హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసే నిర్మాతలందరికీ ఈ అవకాశం ఉండదు. సో ఇదంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…