ఎన్నో బ్రేకులు, అవాంతరాలు, మార్పులు చేర్పుల మధ్య ఎట్టకేలకు సరైన పట్టాలెక్కిన గుంటూరు కారం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. హైదరాబాద్ లోనే కీలక షెడ్యూల్స్ ని ప్లాన్ చేయడంతో మహేష్ బాబుతో సహా క్యాస్టింగ్ మొత్తం ఇందులో పాల్గొంటోంది. తాజాగా శ్రీలీల కిడ్నాప్ అయ్యే ఎపిసోడ్ ని షూట్ చేశారని సమాచారం. విలన్లు తీసుకెళ్లిపోయాక హీరో వచ్చి ఆమెను కాపాడే ట్రాక్ ఓ రేంజ్ లో వచ్చిందని ఇన్ సైడ్ టాక్. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎప్పుడో వచ్చిన అతడు, జులాయి తర్వాత ఆ స్థాయి అనిపించే యాక్షన్ మాస్ ని ఇందులో చూపిస్తున్నారని వినికిడి.
ఈ కాపాడే క్రమాన్ని కూడా ఊర మాస్ గా తీశారని అంటున్నారు. అభిమానులు గుంటూరు కారం మీద ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారో త్రివిక్రమ్ కు తెలుసు. అందులోనూ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన ఒత్తిడి తన మీద ఉంది. అల వైకుంఠపురములో తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ ని ఈ ప్రాజెక్టుతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాలకు రచన చేసేందుకు వాడుకున్న గురూజీ ఎలాంటి పొరపాటుకి ఛాన్స్ ఇవ్వకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. తమన్ ఇచ్చిన పాటల్లో ఆల్రెడీ రెండు ఓకే కాగా త్వరలోనే లిరికల్ వీడియో వదలబోతున్నారు.
జనవరి 12 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఖచ్చితంగా ఆ డెడ్ లైన్ మీట్ అవ్వాల్సిందేనని బలంగా ఫిక్స్ కావడంతో దానికి అనుగుణంగానే షూట్ జరుగుతోంది. గుంటూరు కారం ప్యాన్ ఇండియా మూవీ కాదు కాబట్టి ప్రమోషన్, డబ్బింగ్ పరంగా అదనపు బరువులు, బాధ్యతలు లేవు. చక్కగా డిసెంబర్ రెండో వారంలోపు గుమ్మడికాయ కొట్టేసుకుంటే ఓ రెండు వారాలు పబ్లిసిటీకి సరిపోతాయి. పోటీ ఎంత ఉన్నా ఎవరు ఉన్నా మహేష్ మాత్రం పండక్కు తగ్గేదేలే అంటున్నాడట. సో అభిమానులు బాబు మాస్ కోసం కౌంట్ డౌన్ మొదలుపెట్టేసుకోవచ్చు.
This post was last modified on August 25, 2023 12:18 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…