స్టేజ్ల మీద ఎగ్జైట్మెంట్తో మాట్లాడే క్రమంలో కొన్నిసార్లు మాటలు తడబడుతుంటాయి. ఒకరికి ఎలివేషన్ ఇవ్వబోయి ఇంకొకరిని టార్గెట్ చేసి ఇబ్బంది పడుతుంటారు వక్తలు. టాలీవుడ్ యువ నటుడు రానా దగ్గుబాటి వేదికల మీద చాలా వరకు హుందాగానే మాట్లాడుతుంటాడు. జోకులు పేల్చినా హద్దులు దాటకుండా చూసుకుంటాడు. కానీ మొన్న దుల్కర్ సల్మాన్ సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను ఒక బాలీవుడ్ కథానాయికను టార్గెట్ చేసిన తీరు చర్చనీయాంశం అయింది. దుల్కర్ ఎంత వినమ్రంగా ఉంటాడో చెబుతూ.. తాను చూసిన అతడి షూటింగ్ విశేషాలను అతను పంచుకున్నాడు.
దుల్కర్ నటించిన ఒక హిందీ సినిమా షూటింగ్ తమ ఇంటికి దగ్గర్లో జరుగుతుంటే చూడ్డానికి వెళ్లానని.. ఓవైపు దుల్కర్ చాలా సింపుల్గా ఉంటే, అందులో నటించిన ఒక హిందీ స్టార్ హీరోయిన్ మాత్రం అతి చేసిందని.. అతను ఎండలో ఉండి షాట్ కోసం ఎదురు చూస్తుంటే ఫోన్లు మాట్లాడుకుంటూ, ఇంకేదో చేస్తూ టైం వేస్ట్ చేసిందని.. ఆమె తీరు నచ్చక చేతిలో ఉన్న బాటిల్ను తాను పగలగొట్టడమే కాక.. షూట్ అయ్యాక తన మిత్రులైన ఆ సినిమా నిర్మాతలను తిట్టిపోశానని రానా వెల్లడించాడు.
ఐతే ఆ వేడుకలో సినిమా పేరు.. ఆ హీరోయిన్ ఎవరన్నది వెల్లడించకపోయినా.. ఈ సినిమా ‘ది జోయా ఫ్యాక్టర్’ అని, రానా మాట్లాడింది సోనమ్ కపూర్ గురించి అని నెటిజన్లు అర్థం చేసుకున్నారు. సోనమ్కు ఇంత పొగరా అంటూ చాలామంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దుల్కర్ ముందు నువ్వెంత అంటూ ఆమె మీద పోస్టులు పెట్టారు. ఈ ట్రోలింగ్ కొంచెం హద్దులు దాటడంతో రానా స్పందించాడు. తాను సరదాగానే ఆ విషయం చెప్పానని.. దుల్కర్తో పాటు సోనమ్ కూడా తన ఫ్రెండే అని.. ఇలా ఆమెను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని.. సోనమ్తో పాటు దుల్కర్కు కూడా తాను సారీ చెబుతున్నానని కూడా రానా అన్నాడు.
This post was last modified on August 15, 2023 4:02 pm
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని…
ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్నిసార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్రరాకపోయి ఉంటే…
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…
ఏపీలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఎన్నికల పోలింగ్ జరిగిన ఈ నెల 13న, ఆ రోజు తర్వాత కూడా..…