ప్రభాస్‍ సినిమాలో నాని హీరోయిన్‍?

నానితో మూడు చిత్రాల్లో నటించిన నివేదా థామస్‍ ఇంతకుముందు ఎన్టీఆర్‍తో ‘జై లవకుశ’లో నటించింది కానీ అగ్ర హీరోల సరసన వరుసగా నటించే ఛాన్స్ దక్కలేదు. ఇప్పటికీ మిడ్‍ రేంజ్‍ సినిమాలే చేస్తోన్న నివేద త్వరలో పవన్‍ ‘వకీల్‍ సాబ్‍’లో ఒక ఎమోషనల్‍ ప్లస్‍ కాంటెంపరరీ వుమన్‍ క్యారెక్టర్‍లో కనిపించనుంది. నివేద స్టార్‍ స్టేటస్‍ దక్కించుకోలేకపోయినా కానీ నటిగా అందరి మన్ననలు అందుకుంది. అందుకే ఆమె ‘మహానటి’ దర్శకుడు నాగ్‍ అశ్విన్‍ దృష్టిలో పడింది.

అశ్విన్‍ త్వరలో ప్రభాస్‍తో తెరకెక్కించనున్న సైన్స్ ఫిక్షన్‍ సినిమాలో నివేద ఒక హీరోయిన్‍ క్యారెక్టర్‍ చేస్తోందట. మెయిన్‍ హీరోయిన్‍గా దీపిక పదుకోన్‍ ఆల్రెడీ ఖరారయిన సంగతి తెలిసిందే. మరో ముఖ్య భూమిక నివేద పోషిస్తుందని సమాచారం. ప్రభాస్‍ ‘ఆదిపురుష్‍’ చిత్రాన్ని అనౌన్స్ చేసినా కానీ నాగ్‍ అశ్విన్‍తో ప్రాజెక్ట్ అయితే ‘రాధే శ్యామ్‍’ పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్లిపోతుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ డెవలప్‍మెంట్స్ గురించి ప్రభాస్‍, అశ్విన్‍ నిత్యం చర్చించుకుంటూనే వున్నారు. అశ్విన్‍కి తాను చేయబోతున్న ‘ఆదిపురుష్‍’ డీటెయిల్స్ కూడా ప్రభాస్‍ చెప్పాడని అశ్విన్‍ వేసిన ట్వీట్‍ చూస్తేనే అర్థమైపోతోంది.