మన ఆడియన్స్ కి అంతగా పరిచయం లేదు కాబట్టి సిద్దార్థ్ మల్హోత్రాని హీరోయిన్ కియారా అద్వానీ భర్తగా చెప్పాల్సి ఉంటుంది. పెద్ద స్టార్ కాకపోయినా చెప్పుకోదగ్గ సినిమాలతో మంచి మార్కెట్ సంపాదించుకుని టాప్ లీగ్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఇతని సినిమా మిషన్ మజ్ను ఒకటే వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్. అది కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుంది. కానీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేదు. అంతకు ముందు థాంక్ గాడ్ డిజాస్టర్ కొట్టింది. అయితే తనతో దిల్ రాజు ఓ భారీ బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది.
హిందీలో పాగా వేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. రాజ్ కుమార్ రావుని పెట్టి విశ్వక్ సేన్ హిట్ ని రీమేక్ చేస్తే దారుణంగా పోయింది. భాగస్వామ్యం తీసుకున్న షాహిద్ కపూర్ జెర్సీ గట్టి దెబ్బేసింది. అందుకే ఎఫ్2 రీమేక్ ని బోనీ కపూర్ తో తీయాలనే ప్రతిపాదనని పెండింగ్ లో ఉంచారు. పడ్డ చోటే గెలవాలని ఇప్పుడు సిద్దార్థ్ మల్హోత్రాతో మంచి బడ్జెట్ తో సినిమాని సెట్ చేస్తున్నారట. దీనికి దర్శకుడిగా శైలేష్ కొలనునే వ్యవహరించబోతున్నట్టు తెలిసింది. తనకు కూడా హిందీ హిట్ షాక్ ఇచ్చింది. అందుకే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగులో యాభై సినిమాలు పూర్తి చేసి తమిళంలో వారసుడుతో ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ కొట్టిన దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లో హిందీ మార్కెట్ ని పట్టాలనే లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ అంతటి వాడే పిలిచి మరీ సౌత్ దర్శకుడు ఆట్లీతో జవాన్ చేయగా లేనిది సరైన కథలు కాంబినేషన్లతో వెళ్తే కనక తెలుగు ప్రొడ్యూసర్లకు రెడ్ కార్పెట్ దక్కే మాట వాస్తవమే. పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటివి ఈ పోకడకి పునాది వేశాయి. మరి రామానాయుడుగారిలా మల్టీ లాంగ్వేజ్ ప్రొడ్యూసర్ గా ఎదగాలనుకుంటున్న దిల్ రాజు అన్నంత పని చేసేలానే ఉన్నారు.
This post was last modified on August 14, 2023 12:08 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…