మన ఆడియన్స్ కి అంతగా పరిచయం లేదు కాబట్టి సిద్దార్థ్ మల్హోత్రాని హీరోయిన్ కియారా అద్వానీ భర్తగా చెప్పాల్సి ఉంటుంది. పెద్ద స్టార్ కాకపోయినా చెప్పుకోదగ్గ సినిమాలతో మంచి మార్కెట్ సంపాదించుకుని టాప్ లీగ్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఇతని సినిమా మిషన్ మజ్ను ఒకటే వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్. అది కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుంది. కానీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేదు. అంతకు ముందు థాంక్ గాడ్ డిజాస్టర్ కొట్టింది. అయితే తనతో దిల్ రాజు ఓ భారీ బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది.
హిందీలో పాగా వేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. రాజ్ కుమార్ రావుని పెట్టి విశ్వక్ సేన్ హిట్ ని రీమేక్ చేస్తే దారుణంగా పోయింది. భాగస్వామ్యం తీసుకున్న షాహిద్ కపూర్ జెర్సీ గట్టి దెబ్బేసింది. అందుకే ఎఫ్2 రీమేక్ ని బోనీ కపూర్ తో తీయాలనే ప్రతిపాదనని పెండింగ్ లో ఉంచారు. పడ్డ చోటే గెలవాలని ఇప్పుడు సిద్దార్థ్ మల్హోత్రాతో మంచి బడ్జెట్ తో సినిమాని సెట్ చేస్తున్నారట. దీనికి దర్శకుడిగా శైలేష్ కొలనునే వ్యవహరించబోతున్నట్టు తెలిసింది. తనకు కూడా హిందీ హిట్ షాక్ ఇచ్చింది. అందుకే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగులో యాభై సినిమాలు పూర్తి చేసి తమిళంలో వారసుడుతో ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ కొట్టిన దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లో హిందీ మార్కెట్ ని పట్టాలనే లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ అంతటి వాడే పిలిచి మరీ సౌత్ దర్శకుడు ఆట్లీతో జవాన్ చేయగా లేనిది సరైన కథలు కాంబినేషన్లతో వెళ్తే కనక తెలుగు ప్రొడ్యూసర్లకు రెడ్ కార్పెట్ దక్కే మాట వాస్తవమే. పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటివి ఈ పోకడకి పునాది వేశాయి. మరి రామానాయుడుగారిలా మల్టీ లాంగ్వేజ్ ప్రొడ్యూసర్ గా ఎదగాలనుకుంటున్న దిల్ రాజు అన్నంత పని చేసేలానే ఉన్నారు.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…