ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఏదైనా పాట వస్తుందేమోనని ఆశించిన అభిమానులకు నిరాశ కలిగించినా గుంటూరు కారం టీమ్ ఒక ఊర మాస్ పోస్టర్ తో వాళ్ళను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. పంచెకట్టుతో కూర్చుని, గాగుల్స్ పెట్టుకుని, స్టైలిష్ గా బీడీ వెలిగించుకునే స్టిల్ మాములు కిరాక్ గా లేదు. అయితే షూటింగ్ జరిగిందే కొంత భాగం కాబట్టి అందులో నుంచే బెస్ట్ అనిపించే లుక్స్ తీసుకుని టీజర్ తర్వాత ఇప్పుడీ గిఫ్ట్ ని అందజేశారు. ఈ కాంబో గత చిత్రాలు అతడు, ఖలేజాలకు పూర్తి భిన్నంగా ఊర మాస్ కంటెంటనే హామీ అయితే ఇచ్చాడు.
పనిలో పనిగా కొన్ని డౌట్స్ కి క్లారిటీ కూడా ఇచ్చేశారు. సంగీత దర్శకుడు తమనే ఉంటాడని నొక్కి చెప్పారు. కేవలం నాలుగున్నర నెలలే టైం ఉంది కాబట్టి షూటింగ్ అయిపోతుందా లేదానే అనుమానాలకు చెక్ పెడుతూ 2024 జనవరి 12 విడుదల తేదీని మరోసారి హైలైట్ చేశారు. కెమరామెన్ గా పిఎస్ వినోద్ కొనసాగుతున్నారు. రవి కె చంద్రన్ వచ్చారన్న వార్త నిజం కాదనే క్లారిటీ వచ్చేసింది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఉంటారనే విషయం అఫీషియల్ గా చెప్పినట్టు అయ్యింది. సో పలు రకాల అంశాల మీద ఉన్న అయోమయం ఒకరకంగా తొలగిపోయినట్టే.
కేవలం మహేష్ కి మాత్రమే పరిమితం చేయడంతో పోస్టర్ లో ఇంకెవరూ లేరు. బిజినెస్ మెన్ రీ రిలీజ్ ని ఎంజాయ్ చేస్తున్న అభిమానులు గుంటూరు కారం ఇచ్చింది చిన్న కానుకే అయినా సర్దుకుని అందులో ఉన్న మాస్ ర్యాంపేజ్ కి కృతజ్ఞతలు చెప్పేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలైన కౌంట్ డౌన్ ఇకపై ఉంటుంది. ఇంకా పాటలు ఫైనల్ చేయడం, వాటి చిత్రీకరణతో పాటు టాకీ పార్ట్ చాలా బాలన్స్ ఉంది. మహేష్ వచ్చే వారం విదేశాల నుంచి తిరిగి వచ్చాక నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేయబోతున్నారు. డిసెంబర్ చివరి వారంలోపే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on August 9, 2023 10:36 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…