ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఏదైనా పాట వస్తుందేమోనని ఆశించిన అభిమానులకు నిరాశ కలిగించినా గుంటూరు కారం టీమ్ ఒక ఊర మాస్ పోస్టర్ తో వాళ్ళను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. పంచెకట్టుతో కూర్చుని, గాగుల్స్ పెట్టుకుని, స్టైలిష్ గా బీడీ వెలిగించుకునే స్టిల్ మాములు కిరాక్ గా లేదు. అయితే షూటింగ్ జరిగిందే కొంత భాగం కాబట్టి అందులో నుంచే బెస్ట్ అనిపించే లుక్స్ తీసుకుని టీజర్ తర్వాత ఇప్పుడీ గిఫ్ట్ ని అందజేశారు. ఈ కాంబో గత చిత్రాలు అతడు, ఖలేజాలకు పూర్తి భిన్నంగా ఊర మాస్ కంటెంటనే హామీ అయితే ఇచ్చాడు.
పనిలో పనిగా కొన్ని డౌట్స్ కి క్లారిటీ కూడా ఇచ్చేశారు. సంగీత దర్శకుడు తమనే ఉంటాడని నొక్కి చెప్పారు. కేవలం నాలుగున్నర నెలలే టైం ఉంది కాబట్టి షూటింగ్ అయిపోతుందా లేదానే అనుమానాలకు చెక్ పెడుతూ 2024 జనవరి 12 విడుదల తేదీని మరోసారి హైలైట్ చేశారు. కెమరామెన్ గా పిఎస్ వినోద్ కొనసాగుతున్నారు. రవి కె చంద్రన్ వచ్చారన్న వార్త నిజం కాదనే క్లారిటీ వచ్చేసింది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఉంటారనే విషయం అఫీషియల్ గా చెప్పినట్టు అయ్యింది. సో పలు రకాల అంశాల మీద ఉన్న అయోమయం ఒకరకంగా తొలగిపోయినట్టే.
కేవలం మహేష్ కి మాత్రమే పరిమితం చేయడంతో పోస్టర్ లో ఇంకెవరూ లేరు. బిజినెస్ మెన్ రీ రిలీజ్ ని ఎంజాయ్ చేస్తున్న అభిమానులు గుంటూరు కారం ఇచ్చింది చిన్న కానుకే అయినా సర్దుకుని అందులో ఉన్న మాస్ ర్యాంపేజ్ కి కృతజ్ఞతలు చెప్పేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలైన కౌంట్ డౌన్ ఇకపై ఉంటుంది. ఇంకా పాటలు ఫైనల్ చేయడం, వాటి చిత్రీకరణతో పాటు టాకీ పార్ట్ చాలా బాలన్స్ ఉంది. మహేష్ వచ్చే వారం విదేశాల నుంచి తిరిగి వచ్చాక నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేయబోతున్నారు. డిసెంబర్ చివరి వారంలోపే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…