స్టార్ హీరోల కొత్త సినిమాల ఫలితాలకు మొదటి మూడు రోజులనే ప్రామాణికంగా తీసుకుంటే బోర్లా పడటం ఖాయమని ఇటీవలి బాక్సాఫీస్ పరిణామాలు ఋజువు చేస్తున్నాయి . ఆదిపురుష్ విషయంలో ఇలాంటి హడావిడినే చూశాం. రోజుకో వంద కోట్ల పోస్టర్ తో హోరెత్తించిన నిర్మాతలు సోమవారం నుంచి అసలు టాక్ బయటికి రావడంతో సైలెంట్ అయిపోయారు. జనం థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. నష్టాల శాతం కొంత మేర తగ్గినా ప్రభాస్ కెరీర్ లో మరో డిజాస్టర్ కాకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్రో కూడా అచ్చం అదే దారిలో వెళ్తోంది.
శుక్రవారం నుంచి ఆదివారం దాకా 50 కోట్లకు పైగా షేర్ వచ్చిందని ప్రచారంతో హోరెత్తించిన బ్రోకు ఆడియన్స్ మండే షాక్ ఇచ్చారు. ఊహించిన దాని కన్నా చాలా తక్కువ వసూళ్లు నమోదై డిస్ట్రిబ్యూటర్లకు డేంజర్ బెల్ మ్రోగింది. నిన్న తిరిగి బేబీని ఊపందుకుందని, కొన్ని చోట్ల పవన్ కన్నా ఆనంద్ దేవరకొండనే ఎక్కువ రాబట్టాడని కొందరు సోషల్ మీడియాలో ఫిగర్లు కూడా ట్వీట్ చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమే. హైదరాబాద్ లాంటి ఒకటి రెండు చోట్ల బ్రో పరిస్థితి బాగున్నంత మాత్రాన ఏపీ తెలంగాణ మొత్తం అలాగే ఉందనుకుంటే అచ్చంగా పప్పులో కాలేసినట్టే.
బ్రోకు నాలుగో రోజు మూడు కోట్లకు దగ్గరగా మాత్రమే షేర్ వచ్చిందట. ఇంచుమించు ఇదే టాక్, టికెట్ రేట్లతో గత ఏడాది భీమ్లా నాయక్ అయిదు కోట్ల షేర్ ని దాటడం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. దీంతో టీమ్ రంగంలోకి దిగి హీరో సాయి తేజ్ ని వెంటబెట్టుకుని సక్సెస్ టూర్ కి బయలుదేరింది. రిలీజయ్యాక ఒక పవన్ సినిమాకి ఇలాంటి పబ్లిసిటీ జరగడం గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేదు. కానీ బ్రో విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇంకో 45 కోట్లకు పైగానే షేర్ రావడమంటే పెద్ద ఫీటని, అది సాధ్యమయ్యే సూచనలు తక్కువేనని బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు.
This post was last modified on August 1, 2023 11:35 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…