జులై వచ్చిందంటే ఇన్ కం ట్యాక్స్ మంత్. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ ను దాఖలు చేయటానికి తుది గడువు జులై 31. నిన్నటితో (సోమవారం) తో ముగిసిన ఈ గడువు ముచ్చట ఇలా ఉంటే.. మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. దేశంలో అత్యధిక ఆదాయపన్ను కట్టిందెవరు? అన్నది క్వశ్చన్ గా మారింది.
అత్యధిక ఆదాయపన్ను అన్నంతనే దేశీయంగా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ.. తర్వాతి స్థానంలో ఉండే గౌతమ్ అదానీనో.. లేదంటే భారీ ఆదాయం ఉంటే రతన్ టాటా లాంటి వారు ఉంటారని భావిస్తారు. కానీ.. అలాంటి అంచనాలు తప్పు. గడిచిన ఏడాదికి సంబంధించి దేశంలోనే అత్యధిక ఆదాయపన్ను కట్టిన ప్రముఖుడు ఎవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.
ఐటీ శాఖ అందించిన డేటా ప్రకారం అక్షయ్ కుమార్ గత ఏడాది 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా రూ.29.5 కోట్ల ఆదాయ పన్నును చెల్లించారు. దీంతో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఆయన నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన తన ఆదాయాన్ని రూ.486 కోట్లుగా ప్రకటించారు.
బాలీవుడ్ లో భారీ పారితోషికంతో పాటు.. ఏడాదిలో ఎక్కువగా సినిమాలు చేయటం.. వాణిజ్య ప్రకటనల్లో నటించటం ద్వారా అక్షయ్ భారీగా సంపాదిస్తుంటారు. దీనికి తోడు.. తన సంపాదనను ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించటంలోనూ ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక.. అంబానీ.. అదానీల కంటే అక్షయ్ ఎక్కువగా ఆదాయపన్ను కట్టటానికి కారణం వారి ఆస్తులు కంపెనీల పేరుతో ఉండటంతో వారి కంటే అక్షయ్ ఎక్కువ పన్ను కట్టే పరిస్థితి. ఇదే.. ఆయన్ను అత్యధికంగా ఆదాయపన్ను చెల్లింపుదారుగా నిలిపింది.
This post was last modified on August 1, 2023 11:53 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…