పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఇప్పటిదాకా సినిమాలతో తనకేమీ టచ్ లేదన్నట్లే ఉంటున్నాడు. అసలతను చాలా ఏళ్ల నుంచి తల్లితో కలిసి పుణెలోనే ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఎయిర్పోర్ట్ల్లో మీడియా కళ్లలో పడటమే తప్ప అతను ఏమాత్రం లైమ్ లైట్కు దగ్గర్లో లేడు. కానీ పవన్ తనయుడిని హీరోగా చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. అకీరా పేరు ఎత్తితే చాలు పవన్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.
తన ఫొటోలు ఏవైనా బయటికి వస్తే చాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. తనకు హీరో ఎలివేషన్లు ఇచ్చేస్తుంటారు ఫ్యాన్స్. అలాంటిది పవన్ సినిమా విడుదల సందర్భంగా అకీరా థియేటర్లలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? శుక్రవారం అదే జరిగింది. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో అకీరా ‘బ్రో’ సినిమా చూశాడు.
అకీరా వచ్చాడని తెలియగానే థియేటర్ దగ్గర మామూలు హడావుడి లేదు. ఒక స్టార్ హీరో వచ్చినంత హంగామా చేశారు అభిమానులు. పవన్, అకీరాల పేర్లతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. ఫ్యూచర్ పవర్ స్టార్ అంటూ అకీరా గురించి నినాదాలు చేశారు ఫ్యాన్స్. అభిమానులను దాటుకుని థియేటర్లోకి వెళ్లడానికి అకీరా చాలానే కష్టపడాల్సి వచ్చింది.
సినిమా నడుస్తున్నంతసేపూ అందరి చూపూ అకీరా మీదే ఉంది. తండ్రిని మించి పొడవుగా ఎదిగిపోయిన అకీరా.. హీరోగా బాగా క్లిక్ అవుతాడనే అందరూ అంచనా వేస్తున్నారు. అతను కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడనే అంచనాతోనే ఉన్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చదువుకుంటూనే నటనలో అకీరా శిక్షణ తీసుకుంటూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక మూణ్నాలుగేళ్లలో అకీరా తెరంగేట్రం గురించి వార్త బయటికి వస్తుందనే అంచనాతో ఉన్నారు.
This post was last modified on July 28, 2023 5:34 pm
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…