Movie News

అకీరా వచ్చాడు.. సందళ్లు తెచ్చాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఇప్పటిదాకా సినిమాలతో తనకేమీ టచ్ లేదన్నట్లే ఉంటున్నాడు. అసలతను చాలా ఏళ్ల నుంచి తల్లితో కలిసి పుణెలోనే ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఎయిర్‌పోర్ట్‌ల్లో మీడియా కళ్లలో పడటమే తప్ప అతను ఏమాత్రం లైమ్ లైట్‌కు దగ్గర్లో లేడు. కానీ పవన్ తనయుడిని హీరోగా చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. అకీరా పేరు ఎత్తితే చాలు పవన్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.

తన ఫొటోలు ఏవైనా బయటికి వస్తే చాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. తనకు హీరో ఎలివేషన్లు ఇచ్చేస్తుంటారు ఫ్యాన్స్. అలాంటిది పవన్ సినిమా విడుదల సందర్భంగా అకీరా థియేటర్లలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? శుక్రవారం అదే జరిగింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో అకీరా ‘బ్రో’ సినిమా చూశాడు.

అకీరా వచ్చాడని తెలియగానే థియేటర్ దగ్గర మామూలు హడావుడి లేదు. ఒక స్టార్ హీరో వచ్చినంత హంగామా చేశారు అభిమానులు. పవన్, అకీరాల పేర్లతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. ఫ్యూచర్ పవర్ స్టార్ అంటూ అకీరా గురించి నినాదాలు చేశారు ఫ్యాన్స్. అభిమానులను దాటుకుని థియేటర్లోకి వెళ్లడానికి అకీరా చాలానే కష్టపడాల్సి వచ్చింది.

సినిమా నడుస్తున్నంతసేపూ అందరి చూపూ అకీరా మీదే ఉంది. తండ్రిని మించి పొడవుగా ఎదిగిపోయిన అకీరా.. హీరోగా బాగా క్లిక్ అవుతాడనే అందరూ అంచనా వేస్తున్నారు. అతను కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడనే అంచనాతోనే ఉన్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చదువుకుంటూనే నటనలో అకీరా శిక్షణ తీసుకుంటూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక మూణ్నాలుగేళ్లలో అకీరా తెరంగేట్రం గురించి వార్త బయటికి వస్తుందనే అంచనాతో ఉన్నారు.

This post was last modified on July 28, 2023 5:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago