ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో మంచి క్రేజ్ సంపాదంచుకున్నది బేబీనే. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ నుంచే ఒక రకమైన క్యూరియాసిటీని కలిగిస్తూ వచ్చింది. హృదయ కాలేయం లాంటి సెటైరిక్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయి.. జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన కలర్ ఫొటో మూవీకి కథ అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది.
ఈ సినిమా నుంచి కొన్ని నెలల ముందు రిలీజ్ చేసిన ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా లాంచ్ చేసిన ట్రైలర్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ప్రి రిలీజ్ బజ్ బాగా ఉన్న ఈ సినిమాను జులై 14న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెన్సార్ కూడా పూర్తి చేశారు.
ఆల్రెడీ యుఎస్కు బేబీ కేడీఎంలు కూడా డెలివరీ అయిపోయినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే ఈ సినిమా నిడివి గురించి సమాచారం బయటికి వచ్చింది. ఏకంగా 2 గంటల 58 నిమిషాల రన్టైమ్తో సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. ఈ రోజుల్లో దాదాపు మూడు గంటల నిడివి అంటే ప్రేక్షకులు తట్టుకోగలరా అన్నది డౌట్. అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు 3 గంటల రన్టైంతోనే అద్భుతాలు చేసిన మాట వాస్తవమే.
ఇటీవల ఆదిపురుష్ కూడా దాదాపు అంత రన్టైంతోనే రిలీజైంది. కానీ బేబీ లాంటి చిన్న సినిమా, పైగా లవ్ స్టోరీకి ఇంత నిడివి అంటే చాలా ఎక్కువ అనే అనిపిస్తోంది. ఇలాంటి సినిమాలు క్రిస్ప్ రన్ టైంతో ఉంటేనే బాగుంటుందేమో. కథలో ఎన్ని మలుపులున్నా.. ఎమోషన్లు వర్కవుట్ అయినా కూడా.. మరీ అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కుదురుగా కూర్చోబెట్టడం అంటే సవాలే. మరి సాయిరాజేష్ కాన్ఫిడెన్స్ ఏమిటో?
This post was last modified on July 11, 2023 10:54 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…