Movie News

ధనుష్ నుంచి ఇంకో ‘రాన్‌జానా’

భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న దక్షిణాది నటుల్లో ధనుష్ ఒకడు. యావరేజ్ లుక్స్‌తో కనిపించినా.. కేవలం తన యాక్టింగ్ టాలెంట్‌తో తమిళులనే కాక తెలుగు వారిని.. అలాగే హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడతను. కొన్ని నెలల కిందటే ‘సార్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. పదేళ్ల కిందటే హిందీలో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుల్లో ఒకడైన ఆనంద్.ఎల్.రాయ్‌తో అతను చేసిన ‘రాన్‌జానా’ అక్కడ ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. ధనుష్ అంటే ఎవరో తెలియని టైంలో ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతో ధనుష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఆనంద్.ఎల్.రాయ్.. తర్వాత అతడితో ‘ఆత్రంగి రే’ అనే మరో సినిమా కూడా చేశాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఆనంద్ ఎల్.రాయ్‌.. ధనుష్‌తో మరో సినిమా తీయబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఇది ‘రాన్‌జానా’కు ఫ్రాంఛైజీ చిత్రంలా ఉంటుందట. ‘రాన్‌జానా’కు కథ అందించిన హిమాంశు శర్మనే దీనికీ స్క్రిప్టు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా గురించి ధనుష్ చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘‘కొన్ని సినిమాలు జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి.

రాన్‌జానా అలాగే మా జీవితాలను మార్చింది. దాన్నొక క్లాసిక్ లాగా మార్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. దశాబ్దం తర్వాత మళ్లీ ‘రాన్‌జానా’ ప్రపంచం నుంచి వస్తున్న కథ.. తేరే ఇష్క్ మే. ఈ సినిమాతో ఒక సాహసోపేతమైన ప్రయాణం చేయబోతున్నాం’’ అని ధనుష్ వెల్లడించాడు. ‘రాన్‌జానా’లో ధనుష్ సరసన నటించిన సోనమ్ కపూర్ ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరం అయిపోయింది. కాబట్టి ఓ కొత్తమ్మాయిని కథానాయికగా తీసుకునే అవకాశముంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.

This post was last modified on June 23, 2023 10:30 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

7 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago