భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న దక్షిణాది నటుల్లో ధనుష్ ఒకడు. యావరేజ్ లుక్స్తో కనిపించినా.. కేవలం తన యాక్టింగ్ టాలెంట్తో తమిళులనే కాక తెలుగు వారిని.. అలాగే హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడతను. కొన్ని నెలల కిందటే ‘సార్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. పదేళ్ల కిందటే హిందీలో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుల్లో ఒకడైన ఆనంద్.ఎల్.రాయ్తో అతను చేసిన ‘రాన్జానా’ అక్కడ ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. ధనుష్ అంటే ఎవరో తెలియని టైంలో ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతో ధనుష్ను బాలీవుడ్కు పరిచయం చేసిన ఆనంద్.ఎల్.రాయ్.. తర్వాత అతడితో ‘ఆత్రంగి రే’ అనే మరో సినిమా కూడా చేశాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఆనంద్ ఎల్.రాయ్.. ధనుష్తో మరో సినిమా తీయబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఇది ‘రాన్జానా’కు ఫ్రాంఛైజీ చిత్రంలా ఉంటుందట. ‘రాన్జానా’కు కథ అందించిన హిమాంశు శర్మనే దీనికీ స్క్రిప్టు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా గురించి ధనుష్ చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘‘కొన్ని సినిమాలు జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి.
రాన్జానా అలాగే మా జీవితాలను మార్చింది. దాన్నొక క్లాసిక్ లాగా మార్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. దశాబ్దం తర్వాత మళ్లీ ‘రాన్జానా’ ప్రపంచం నుంచి వస్తున్న కథ.. తేరే ఇష్క్ మే. ఈ సినిమాతో ఒక సాహసోపేతమైన ప్రయాణం చేయబోతున్నాం’’ అని ధనుష్ వెల్లడించాడు. ‘రాన్జానా’లో ధనుష్ సరసన నటించిన సోనమ్ కపూర్ ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరం అయిపోయింది. కాబట్టి ఓ కొత్తమ్మాయిని కథానాయికగా తీసుకునే అవకాశముంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.
This post was last modified on June 23, 2023 10:30 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…