ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలు కావడానికి చాలా సమయం పడుతుంటే అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ షూట్ పూర్తయ్యాక ఏడాదిన్నరకు కానీ కొరటాల శివ దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు. కానీ ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోగా నటించిన రామ్ చరణ్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండా.. శంకర్ డైరెక్షన్లో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిపోయాడు.
చకచకా కొన్ని షెడ్యూళ్లు కూడా పూర్తి చేశాడు. చరణ్ సినిమా వేగం చూసి తారక్ ఫ్యాన్స్ మరింత ఫీలయ్యారు. కానీ తర్వాత చూస్తే పరిస్థితి మారిపోయింది. ‘ఇండియన్-2’ అడ్డం పడటంతో ‘గేమ్ చేంజర్’ వేగం పడిపోయింది. చరణ్, దిల్ రాజుల అంగీకారంతోనే శంకర్ ఆ ప్రాజెక్టును కూడా సమాంతరంగా పూర్తి చేయడానికి పూనుకున్నప్పటికీ.. రెండు సినిమాలతో సమన్వయం చేసుకోవడంలో శంకర్ ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తోంది.
ఈ మధ్య అసలు ‘గేమ్ చేంజర్’ వార్తల్లోనే లేకుండా పోయింది. ఆ సినిమా షూటింగ్ గురించి కూడా పెద్దగా అప్డేట్స్ రావట్లేదు. ఈ ఏడాది సంక్రాంతికే అనుకున్న సినిమా కాస్తా.. వచ్చే సంక్రాంతికి కూడా రాదని తేలిపోయింది. కనీసం వచ్చే వేసవికైనా సినిమాను సిద్ధం చేయగలరా అన్న సందేహం కలుగుతోంది. ప్రస్తుతానికి ‘ఇండియన్-2’ మీదే శంకర్ ఫోకస్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి శంకర్ కష్టపడుతున్నాడు.
పోస్ట్ ప్రొడక్షన్ పనిని వేరే వాళ్లకు అప్పగించే రకం కాదు శంకర్. తన సినిమాకు సంబంధించి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాడు. ఇలా ‘ఇండియన్-2’ మీద ఆయన ఫోకస్ పెరిగిపోవడంతో ‘గేమ్ చేంజర్’ బాగా ఆలస్యం అవుతోంది. మరోవైపు ‘దేవర’ను తారక్ చకచకా పూర్తి చేస్తున్నాడు. అనుకున్నట్లే వచ్చే మే 5న ఆ సినిమా రిలీజ్ కాబోతోంది. లేటుగా షూట్ మొదలైనప్పటికీ చరణ్ కంటే తారక్ సినిమానే ముందు రిలీజయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on June 13, 2023 1:52 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…