నిన్న విడుదలైన వాటిలో చాలా తక్కువ ప్రమోషన్లతో వచ్చిన సినిమా ఇంటింటి రామాయణం. హడావిడి నిర్ణయం కావడంతో టైం సరిపోని కారణంగా పబ్లిసిటీ ఎక్కువ చేయలేకపోయారు. వాస్తవానికి ఇది ముందు ఆహా ఓటిటి కోసమని ప్లాన్ చేశారు. కానీ బలగం సక్సెస్ చూశాక తెలంగాణ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుందని గుర్తించి థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. మొన్నే ఒకటి రెండు చోట్ల ప్రీమియర్లు వేశారు కానీ దాని తాలూకు సందడి సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇంతకీ ఇంటింటి రామాయణంలో మ్యాటరుందానే ఆసక్తి కలగడం సహజం
నలుగురికి మంచి చేస్తూ సహాయ పడే రాములు(నరేష్)కి ఊరంతా చుట్టాలే. ఎదురింట్లో ఉండే శ్రీనివాస్(రాహుల్ రామకృష్ణ) తన కూతురు సంధ్య(నవ్య స్వామి)కి లైన్ వేస్తున్నా గుర్తు పట్టలేనంత అమాయకత్వంలో బ్రతుకుతుంటాడు. ఇలా వీళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతూ ఉండగా రాములు ఇంట్లో విలువైన బంగారం చోరీ అవుతుంది. ఎవరు కొట్టేశారో పట్టుకునే దిశలో అయినవాళ్ల మీదే అనుమానం వస్తుంది. దొంగెవరో తెలుసుకునే క్రమంలో జరిగే సంఘటనలే ఇంటింటి రామాయణం. ఫస్ట్ హాఫ్ సరదాగా నడిచే సన్నివేశాలతో దర్శకుడు సురేష్ నరెడ్ల టైం పాస్ అయితే చేయించాడు
సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి బలమైన కంటెంట్ లేకపోవడంతో రిపీట్ అనిపించే సన్నివేశాలతో బోర్ కొట్టించేస్తాడు. నేటివిటీని చక్కగా చూపించినా అవసరం లేని సాగతీత ఫ్లోని దెబ్బ తీసింది. పైగా క్లైమాక్స్ కూడా ఏమంత కన్విన్సింగ్ గా ఉండదు. ఇంకేదో ట్విస్టు ఎక్స్ పెక్ట్ చేస్తాం కానీ అది నిరాశ పరుస్తుంది. నరేష్ తో సహా ఆరిస్టులందరూ చక్కగా నటించినప్పటికీ దర్శకుడి తడబాటు వల్ల టికెట్ సొమ్ములకు న్యాయం జరిగినట్టు అనిపించదు. తెలంగాణ మీద అభిమానం, బోలెడంత ఓపిక ఉంటే ఓసారి ట్రై చేయొచ్చు కానీ ఇంటింటి రామాయణంలో బిగ్ స్క్రీన్ మ్యాటర్ అయితే పెద్దగా లేదు
This post was last modified on June 10, 2023 10:03 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…