నిన్న విడుదలైన వాటిలో చాలా తక్కువ ప్రమోషన్లతో వచ్చిన సినిమా ఇంటింటి రామాయణం. హడావిడి నిర్ణయం కావడంతో టైం సరిపోని కారణంగా పబ్లిసిటీ ఎక్కువ చేయలేకపోయారు. వాస్తవానికి ఇది ముందు ఆహా ఓటిటి కోసమని ప్లాన్ చేశారు. కానీ బలగం సక్సెస్ చూశాక తెలంగాణ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుందని గుర్తించి థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. మొన్నే ఒకటి రెండు చోట్ల ప్రీమియర్లు వేశారు కానీ దాని తాలూకు సందడి సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇంతకీ ఇంటింటి రామాయణంలో మ్యాటరుందానే ఆసక్తి కలగడం సహజం
నలుగురికి మంచి చేస్తూ సహాయ పడే రాములు(నరేష్)కి ఊరంతా చుట్టాలే. ఎదురింట్లో ఉండే శ్రీనివాస్(రాహుల్ రామకృష్ణ) తన కూతురు సంధ్య(నవ్య స్వామి)కి లైన్ వేస్తున్నా గుర్తు పట్టలేనంత అమాయకత్వంలో బ్రతుకుతుంటాడు. ఇలా వీళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతూ ఉండగా రాములు ఇంట్లో విలువైన బంగారం చోరీ అవుతుంది. ఎవరు కొట్టేశారో పట్టుకునే దిశలో అయినవాళ్ల మీదే అనుమానం వస్తుంది. దొంగెవరో తెలుసుకునే క్రమంలో జరిగే సంఘటనలే ఇంటింటి రామాయణం. ఫస్ట్ హాఫ్ సరదాగా నడిచే సన్నివేశాలతో దర్శకుడు సురేష్ నరెడ్ల టైం పాస్ అయితే చేయించాడు
సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి బలమైన కంటెంట్ లేకపోవడంతో రిపీట్ అనిపించే సన్నివేశాలతో బోర్ కొట్టించేస్తాడు. నేటివిటీని చక్కగా చూపించినా అవసరం లేని సాగతీత ఫ్లోని దెబ్బ తీసింది. పైగా క్లైమాక్స్ కూడా ఏమంత కన్విన్సింగ్ గా ఉండదు. ఇంకేదో ట్విస్టు ఎక్స్ పెక్ట్ చేస్తాం కానీ అది నిరాశ పరుస్తుంది. నరేష్ తో సహా ఆరిస్టులందరూ చక్కగా నటించినప్పటికీ దర్శకుడి తడబాటు వల్ల టికెట్ సొమ్ములకు న్యాయం జరిగినట్టు అనిపించదు. తెలంగాణ మీద అభిమానం, బోలెడంత ఓపిక ఉంటే ఓసారి ట్రై చేయొచ్చు కానీ ఇంటింటి రామాయణంలో బిగ్ స్క్రీన్ మ్యాటర్ అయితే పెద్దగా లేదు
This post was last modified on June 10, 2023 10:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…