Movie News

నీల్ ప్లాన్లన్నీ టాలీవుడ్ హీరోలతోనే

విడుదల ముందు వరకు ఎలాంటి అంచనాలు లేకుండా కెజిఎఫ్ రూపంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. శాండల్ వుడ్ కు మొదటి వెయ్యి కోట్ల సినిమా అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సలార్ మీద అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. ఆదిపురుష్ ఎంత బాగా ఆడినా డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ మాత్రం దీనికోసమే ఉంది. అయితే నీల్ కన్నడ చిత్రాలకే పరిమితం కావాలని, అక్కడి స్టాండర్డ్స్ ని ఇంకా పెంచాలని మూవీ లవర్స్ ఎంత పోరు పెడుతున్నా అతను మాత్రం టాలీవుడ్ నే శాశ్వత అడ్డాగా మార్చుకోబోతున్నాడు.

దీనికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. సలార్ అయిపోయాక ప్రశాంత్ నీల్ వెంటనే ఎన్టీఆర్ 31 మొదలుపెడతాడు. ఎంత లేదన్నా షూటింగ్ ఏడాది పైగానే పడుతుంది. ఆ తర్వాత సలార్ 2 తాలూకు పనులు ఉంటాయి. సీక్వెల్ అఫీషియల్ గా చెప్పకపోయినా ఆల్రెడీ లాక్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్. ఇది పూర్తి చేశాక రామ్ చరణ్ తో ప్రాజెక్టు ఉంటుంది. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు. కెజిఎఫ్ 3 అన్నారు కానీ అది కార్యాచరణలో జరగడం అనుమానమే. ఇది మినహాయించి చూసుకున్నా ప్రశాంత్ పై వన్నీ పూర్తి చేసుకునేసరికి ఎంత లేదన్నా 2026 వచ్చేస్తుంది

ఆలోగా కొత్త కమిట్ మెంట్లు కాంబినేషన్లు ఎలాగూ ఉంటాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో చేసేందుకు నీల్ చాలా ఆసక్తిగా ఉన్నాడు. అడగాలే కానీ వాళ్ళు నో చెప్పరు. అలాంటప్పుడు తిరిగి కన్నడ గూటికి చేరుకోవడం జరిగే పని కాదు. పైగా కెజిఎఫ్ కు యష్ దొరికాడు కానీ ప్రతిసారి అలాంటి హీరోలను సెట్ చేసుకోవడం అంత సులభం కాదు. అయితే తెలుగులో బోలెడు ఆప్షన్లున్నాయి. మార్కెట్ కూడా చాలా పెద్దది. కాబట్టి ఇంకో పదేళ్ల దాకా నీల్ జెండా తెలుగు నుంచి కదలడం కష్టమే. ఆదిపురుష్ రిలీజైన వారం పది రోజుల్లో సలార్ ప్రమోషన్లకు భారీ ఎత్తున మొదలుపెట్టబోతున్నారు

This post was last modified on June 6, 2023 7:25 am

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

41 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago