Political News

వైసీపీ మ‌హిళా ఎంపీ భూక‌బ్జా.. సొంత వ‌దినే రోడ్డెక్కారుగా!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. క‌ర్నూలుకు చెందిన మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రామ్‌, అనంతపురానికి చెందిన మంత్రి ఉష శ్రీ చ‌ర‌ణ్‌ల‌పై భూముల క‌బ్జాకు సంబంధిం చిన ఆరోప‌ణ‌లు పుంఖాను పుంఖాలుగా వ‌చ్చాయి. అయితే.. వీటిపై ఎన్ని వార్త‌లు వ‌చ్చినా.. ఎన్ని ఆరోప‌ణలు వ‌చ్చినా.. వైసీపీ ప్ర‌భుత్వం లెక్క‌చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీతపై సొంత కుటుంబ స‌భ్యులే భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేశారు. ఆమెపై ఏకంగా స్పంద‌న‌లో ఫిర్యాదు రావ‌డం.. ఎంపీ పేరు కూడా ఉండ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. తమ ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారని ఎంపీ వదిన కళావతి ఆరోపించారు. తిరిగి వాటిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు స్పంద‌న కార్య‌క్ర‌మంలో ఫిర్యాదు చేశారు. 2006లో తమ ఆస్తులు తన భర్త కృష్ణ కుమార్ తో బలవంతంగా రాయించుకున్నారని ఆమె ఆరోపించారు.

2010లో ఆయన చనిపోయారని కళావతి తెలిపారు. ఆ తర్వాత తమ ఇంట్లో దొంగతనం చేయించి బంగారు నగలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఆస్తుల కోసం తమ పిల్లలు న్యాయస్థానంలో పోరాడుతుంటే చంపేస్తామని ఎంపీ వంగా గీత బెదిరిస్తున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో కూడా తెలీడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించలేదని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వంగా గీత దంపతులు, సోదరి కుసుమ కుమారి దంపతులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లాకు కళావతి ఫిర్యాదు చేశారు.

క‌ళావ‌తి ఫిర్యాదు మేర‌కు.. ఎంపీ గీత వ్య‌వ‌హారం ఇలా.. ఉంది.

భూక‌బ్జా – 6 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి
భూక‌బ్జా – 600 గ‌జాల ఇల్లు
బంగారం – 50 కాసులు
న‌గ‌దు – ఇంట్లో ఉన్న 50 వేల రూపాయ‌ల‌ను గీత అనుచ‌రులు దోచుకెళ్లార‌ని ఆమె ఆరోపించారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago