ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై భూకబ్జా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులపై ఈ తరహా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్, అనంతపురానికి చెందిన మంత్రి ఉష శ్రీ చరణ్లపై భూముల కబ్జాకు సంబంధిం చిన ఆరోపణలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయితే.. వీటిపై ఎన్ని వార్తలు వచ్చినా.. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. వైసీపీ ప్రభుత్వం లెక్కచేయకపోవడం గమనార్హం.
తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీతపై సొంత కుటుంబ సభ్యులే భూకబ్జా ఆరోపణలు చేశారు. ఆమెపై ఏకంగా స్పందనలో ఫిర్యాదు రావడం.. ఎంపీ పేరు కూడా ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తమ ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారని ఎంపీ వదిన కళావతి ఆరోపించారు. తిరిగి వాటిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 2006లో తమ ఆస్తులు తన భర్త కృష్ణ కుమార్ తో బలవంతంగా రాయించుకున్నారని ఆమె ఆరోపించారు.
2010లో ఆయన చనిపోయారని కళావతి తెలిపారు. ఆ తర్వాత తమ ఇంట్లో దొంగతనం చేయించి బంగారు నగలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఆస్తుల కోసం తమ పిల్లలు న్యాయస్థానంలో పోరాడుతుంటే చంపేస్తామని ఎంపీ వంగా గీత బెదిరిస్తున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో కూడా తెలీడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించలేదని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వంగా గీత దంపతులు, సోదరి కుసుమ కుమారి దంపతులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లాకు కళావతి ఫిర్యాదు చేశారు.
కళావతి ఫిర్యాదు మేరకు.. ఎంపీ గీత వ్యవహారం ఇలా.. ఉంది.
భూకబ్జా – 6 ఎకరాల వ్యవసాయ భూమి
భూకబ్జా – 600 గజాల ఇల్లు
బంగారం – 50 కాసులు
నగదు – ఇంట్లో ఉన్న 50 వేల రూపాయలను గీత అనుచరులు దోచుకెళ్లారని ఆమె ఆరోపించారు.
This post was last modified on June 6, 2023 11:04 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…