టాలీవుడ్లో ముఖానికి మాస్కులేసుకోకుండా మాట్లాడే, ప్రవర్తించే హీరోల్లో ప్రభాస్ పేరును ముందు వరుసలో చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వ పరంగా ప్రభాస్ గోల్డ్ అని అంటారు అందరూ. తన చుట్టూ ఉన్న వాళ్లందరినీ చాలా బాగా చూసుకుంటాడని ప్రభాస్కు పేరుంది. ఎప్పట్నుంచో తనకు మిత్రులైన ప్రమోద్, వంశీలను ‘మిర్చి’ సినిమాతో నిర్మాతలుగా మార్చి ‘యువి క్రియేషన్స్’ను పెద్ద స్థాయికి తీసుకెళ్లాడు ప్రభాస్.
ఐతే ఒక దశ వరకు టాలీవుడ్లో యువి వాళ్ల ఆధిపత్యం నడిచింది. ఆ సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ‘బాహుబలి’ తర్వాత వరుసగా రెండు సినిమాలు కమిటయ్యాడు ప్రభాస్. ఇది యువి వాళ్లకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. కానీ ఈ అవకాశాలను యువి వాళ్లు ఉపయోగించుకోలేకపోయారు. పెరిగిన ప్రభాస్ రేంజికి తగ్గట్లు అయిన కాడికి ఖర్చు పెట్టి సాహో, రాధేశ్యామ్ చిత్రాలను నిర్మిస్తే.. అవి రెండూ నిరాశనే మిగిల్చాయి. దీంతో భారీ నష్టాలు తప్పలేదు.
కొత్తగా పెద్ద సినిమాలు నిర్మించడానికి డబ్బులు లేకపోగా.. అప్పుడు భారీ స్థాయిలో ఉండటంతో యువి వాళ్ల భవిష్యత్తే ప్రమాదకరంగా మారిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభాసే.. తన మిత్రులను కష్టాల నుంచి గట్టెక్కించినట్లు తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ తెలుగు రాష్ట్రాల హక్కులను చాలా ముందుగానే తక్కువ రేటుకు యువి వాళ్లకు ఇప్పించాడు ప్రభాస్. ఒక రకంగా చెప్పాలంటే ఈ హక్కులను ప్రభాస్ కోసమనే తక్కువకు ఇచ్చాడు నిర్మాత భూషణ్ కుమార్.
మొదట్లో పెట్టిన పెట్టుబడి రూ.80 కోట్లయితే.. ఇప్పుడు అంతకు రెట్టింపు కన్నా కాస్త ఎక్కువ రేటుకు మారు బేరానికి పీపుల్స్ మీడియా వాళ్లకు ఇచ్చారు. ఈ డీల్తో 80-90 కోట్ల మధ్య యువి వాళ్లకు లాభం చేకూరినట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ కొత్త చిత్రం ‘స్పిరిట్’లోనూ యువి వాళ్లు భాగస్వాములుగా ఉండగా.. ఆ డీల్ను కూడా పీపుల్స్ మీడియా వాళ్లకే మళ్లించారు. ఇలా భాగస్వామ్య హక్కులను ఇచ్చినందుకు కూడా యువి వాళ్లకు పీపుల్స్ మీడియా నుంచి భారీగానే ముట్టింది.
ఈ రెండు డీల్స్లోనూ ప్రభాసే కీలకం. అతనే మధ్యలో ఉండి యువి వాళ్లకు భారీగా ఆదాయం సమకూరేలా చేశాడు. దిల్ రాజుకు ఇవ్వాల్సిన రూ.40 కోట్లతో పాటు.. మొత్తం అప్పులన్నీ క్లియర్ చేసి.. ఇప్పుడు కొత్త సినిమాల కోసం పెద్ద ఫండ్ కూడా రెడీ చేసుకుని యువి వాళ్లు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఇదంతా ప్రభాస్ వల్లే సాధ్యమైందంటూ.. అతడి మనసు బంగారం అంటూ ఇండస్ట్రీ జనాలు కొనియాడుతున్నారు
This post was last modified on May 31, 2023 6:20 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…