ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేయబోతున్న డైరెక్ట్ హోమ్ రిలీజ్ కాన్సెప్ట్ మీద ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మెన్ గౌతమ్ రెడ్డి చెప్పిన మాటలు చర్చకు దారి తీశాయి. దాని ప్రకారం కొత్త సినిమాలు విడుదల రోజే కేవలం 99 రూపాయలు కట్టి ఇంట్లోనే చూసుకోవచ్చట. కాకపోతే ఇరవై నాలుగు గంటలో షోని పూర్తి చేసుకోవాలి. సరే ఈ టైం ఫ్రేమ్ పెద్ద ఇబ్బంది కాదు కానీ అసలు ఇది అమలులో ఎంత మేరకు సాధ్యమని ప్రాక్టికల్ గా ఆలోచిస్తే దరిదాపుల్లో కూడా నో అనే చెప్పాలి. ఎగ్జిబిషన్ వ్యవస్థను దెబ్బ తీసే ఇలాంటి ప్రయత్నాలకు నిర్మాతల మద్దతు ఎలా వస్తుంది
ఇక్కడ విశ్లేషించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ముందు టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా ఉన్న రోజుల్లో ఇంట్లోనే హెచ్డి క్వాలిటీతో షో వేసుకుంటే అది చాలా తేలికగా కోట్లాది మందికి పైరసీ రూపంలో చేరిపోతుంది. దాన్ని కట్టడి చేయడానికి ఎంత సాంకేతికత వాడినా ప్రయోజనం ఉండదు. వేల కోట్ల టర్నోవర్ ఉన్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వల్లే చేతకాని సమస్య ఇది. తర్వాతి అంశం ఇలా చేస్తే థియేటర్లకు ఎవరొస్తారనే పాయింట్. ఒకపక్క కదలకుండా మొదటి రోజే చూసే సౌలభ్యం ఉన్నప్పుడు అదే పనిగా వందలు వేలు పోసి హాళ్లకు వెళ్లే ఆడియన్స్ ఎంతమంది ఉంటారు.
ఈ మోడల్ ల్యాబులో మగ్గిపోతూ నిర్మాత ఆర్థిక పరిస్థితుల వల్ల బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న చిన్న సినిమాలకు తప్ప ఇంకెవరికి పని చేయదు. ఆదిపురుష్, గేమ్ చేంజర్ లాంటివి కాదు లేదా కనీసం సంతోష్ శోభన్ లాంటి చిన్న హీరోల చిత్రాలను ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు. అలాంటప్పుడు ఇదంతా ఊరికే పబ్లిసిటీ ఆరాటం అవుతుందే తప్ప నిజంగా జరిగే ఆస్కారం ఎక్కడిది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఆర్టిస్టుల దాకా ఎవరూ దీన్ని సమర్ధించరు. థియేటర్ రన్ పూర్తయ్యాక చేస్తే ఓకే కానీ మరీ అన్ని సినిమాలు ఫస్ట్ డే ఇంట్లోనే చూడొచ్చంటే నమ్మేదెలా
This post was last modified on May 31, 2023 6:16 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…